కొన్ని సినిమాలకు షూటింగ్ ఎంత ముఖ్యమో, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అంతే ముఖ్యం. అలాంటి చిత్రాల్లో `సైరా` స్థానం చెప్పుకోదగ్గది. ప్రతి ఫ్రేమ్ను తీర్చిదిద్దుతున్నారు చిత్రయూనిట్. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా చిరంజీవి డబ్బింగ్ చెప్పేశారు. `సైరా` చారిత్రక చిత్రం. రాయలసీమ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతోన్న చిత్రం. ఇందులో నరసింహారెడ్డిగా చిరంజీవి కనిపిస్తారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న పాత్రకు డబ్బింగ్ చెప్పడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మామూలు సినిమాలకే హీరోలు రెండు, మూడు రోజులు డబ్బింగ్ చెబుతుంటారు. అలాంటిది నరసింహారెడ్డి పాత్రకు మెగాస్టార్ చిరంజీవి కేవలం 20 గంటల్లో డబ్బింగ్ చెప్పేశారట. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీత దర్శకుడు. నయనతార, తమన్నా నాయికలుగా నటిస్తున్నారు.
previous post