ఆఖరి నిమిషంలో తప్పుకోవడాలు, మాటిచ్చిన తర్వాత మడమ తిప్పడాలు…. వంటివాటికి తమన్నా ఎప్పుడూ దూరమే. ఆమె దేనికీ అంత తేలిగ్గా తలవంచదు. అలాంటిది ఇటీవల తమన్నా తీసుకున్నారంటున్న ఓ నిర్ణయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. తమన్నా హీరోయిన్గా `రాజు గారి గది3`ని ప్రకటించారు.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. `రాజుగారి గది`, `రాజుగారి గది2` ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాయో మనకు తెలిసిందే. తాజాగా `రాజుగారి గది3` కోసం కూడా దర్శకుడు ఓంకార్ అంతే సన్నాహాలు చేసుకున్నారు. ఆయన ఆరు నెలల ముందే తమన్నాను కలిసి కథ చెప్పారట. అప్పుడు చెప్పిన కథ తమన్నాకు నచ్చడంతో డాటెడ్ లైన్స్ లో సైన్ చేశారు. కానీ ఇటీవల మళ్లీ ఓ సారి తమన్నా కథ విన్నారట. గతంలో విన్న కథకూ, ఈ కథకూ చాలా మార్పులూ చేర్పులూ జరిగాయట. తన పాత్ర విషయంలోనూ ఈ మార్పులు చోటుచేసుకున్నాయట. తాజాగా చేసిన మార్పుల పట్ల ఆమెకు సంతృప్తిలేదట. అందుకే తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారని టాక్. మరో వెర్షన్ ప్రకారం ఆమె ఇటీవల బాలీవుడ్లో నవాజుద్దీన్ సిద్ధిఖీతో నటించడానికి సంతకం చేశారు. సో ఆ డేట్లకు, ఈ సినిమా డేట్లు క్లాష్ కావడంతో `రాజుగారి గది3` నుంచి తప్పుకున్నారన్నది సమాచారం.
previous post
next post