మరో రెండు రోజుల్లో కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. నాలుగు భాషల్లో ఈ సినిమాని రూపొందించగా ఇప్పటికే ప్రమోషన్స్ తో ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచేశారు మేకర్స్. టీజర్ ని టాప్ హీరోయిన్స్ తాప్సీ, త్రిష, సమంత, మంజు వారియర్ రిలీజ్ చేసి కీర్తి కి సపోర్ట్ చేస్తే ట్రైలర్ ని నాని తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు రిలీజ్ చేసి కీర్తి ని బాగా ప్రమోట్ చేశారు.
ఇక ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కమిటయిన సినిమాలు 6 ఉన్నాయట. తెలుగులో నితిన్ నటిస్తున్న రంగ్ దే దాదాపు చిత్రీకరణ కంప్లీట్ కావచ్చిందని సమాచారం. ఈ సినిమాకి కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే తను నటిస్తున్న మిస్ ఇండియా, రజనీకాంత్ అన్నాత్తే, గుడ్ లక్ సఖీ సినిమాలతో పాటు సర్కారు వారి పాట, నితిన్ తాజా చిత్రం …లైన్ లో ఉన్నాయట.
అయితే ఇటీవల షూటింగ్స్ కి అనుమతులు వచ్చి మేకర్స్ తమ సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని సన్నాహాలు చేస్తున్న సమయంలో కీర్తి సురేష్ మాత్రం కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గే వరకు షూటింగ్స్ లో పాల్గొనలేనంటూ చెప్పినట్టు తాజా సమాచారం. దీంతో దర్శక, నిర్మాతలు షాకయ్యారట. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తీలుదు గాని కీర్తి సురేష్ ఆలోచన ఒక రకంగా కరెక్టే కదా.