Pawan Kalyan: ఏపీలో వాలంటీర్ లు నిర్వహిస్తున్న విధులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలను అధికార వైసీపీ తీవ్రంగా ఖండించింది. మరో పక్క పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం దావా వేసేందుకు కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. వాలంటీర్లు సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత డేటాపై కొద్ది రోజులుగా రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ ఇప్పటి తన వ్యాఖ్యలపై కొంత వివరణ ఇచ్చినా వాలంటీర్ల సేకరిస్తున్న డేటాపై మాత్రం తప్పుబడుతూనే ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ .. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ కు ప్రశ్నలను సంధించారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ మరో సారి ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మూడు ప్రశ్నలను సంధిస్తూ వాటికి జగన్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.
- వాలంటీర్లకు బాస్ ఎవరు?
- ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?
- వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు అని జగన్ ను పవన్ ప్రశ్నించారు?.
దీనికి సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రజల ఆధార్, ఓటర్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ వంటి వ్యక్తిగత డేటా ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉంటే అది నేరం అని పేర్కొన్న వీడియోను పవన్ షేర్ చేశారు.
Sajjala Rama Krishna Reddy: ‘చంద్రబాబు కుళ్లికుళ్లి చావడం ఖాయం’
Everyone’s concern is same .. my dear Watson!. Data privacy laws will remain the same,whether you are CM or not. So answer these basic three questions.
1) Who’s the Boss of Volunteers?
2) Where are you storing the
personal data of People of AP?
3) Who has authorised… pic.twitter.com/oWsMb04RCj— Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023