Sajjala Rama Krishna Reddy: అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఈ నెల 24వ తేదీన కృష్ణాయపాలెంలో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50వేల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలను ఇప్పటికే పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. శరవేగంగా గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతోంది. 24న భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో శనివారం ఏర్పాట్లను మంత్రులతో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.
అయితే ఆర్ – 5 జోన్ లో ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి గానూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను హోల్డ్ లో పెట్టింది. కోర్టు తీర్పు అనంతరం నిధులు విడుదల చేస్తామని తెలిపింది.
ఈ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇళ్లు కట్టడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఒక సారి స్థలం ఇచ్చిన తర్వాత అక్కడ ఇల్లు కాక ఇంకా ఏమి వస్తుంది, ఆయన చంద్రబాబు దృష్టిలో ఇంకా వేరేది ఏమైనా వస్తాయేమో కానీ ఇక్కడ ఇళ్లే వస్తాయి. ఇళ్లు వస్తాయి కాబట్టి ఇళ్లు కడతాం. ఒక వేళ దీనికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వం సర్వహక్కులను వాడి దాన్ని నిలబెట్టుకుంటుంది. స్థలం ఇచ్చిన తర్వాత ఇళ్లు కట్టడం నేరం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు.
అన్నిసౌకర్యాలతో పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. పేదలకు మహా అయితే స్థలాలు ఇచ్చారు. రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్లు కట్టించి ఇచ్చే ఏర్పాట్లు చేశారు కానీ ఏ టు జడ్ ఆలోచనతో విశాలమైన రోడ్లుతో ఒక లే అవుట్ ఎలా ఉంటుందో అలాంటిది ప్రభుత్వం పూనుకుని పేదవాళ్లు ఉండటానికి అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్లు ఆత్మగౌరవంతో ఉండే రకంగా తీర్చిదిద్దడం జరుగుతోంది. ఆరు నెలల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి అవుతాయి. పేదల ఇళ్ల నిర్మాణంతో రూ.10వేల కోట్ల సంపద ఏర్పడుతుంది. పేదలు కోటీశ్వరులు కావడం ఖాయం. చంద్రబాబు నాయుడు కుళ్లికుళ్లి ఏడ్చి చావడం ఖాయం అని సజ్జల అన్నారు.
దివంగత మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను ఎన్ఐఏ అధికారులు ఎందుకు అరెస్టు చేశారంటే ..?
సీఆర్డీఏ పరిధిలోని R5 జోన్లో నిర్మించనున్న పేదల ఇళ్ల నిర్మాణాలను 6 నెలల్లో పూర్తి చేస్తాం. ఇళ్లు పూర్తయ్యే సరికి ఇక్కడ రూ.10వేల కోట్ల సందప ఏర్పడుతుంది. ఐదేళ్లలో ఇక్కడ ఇళ్లు పొందిన పేదలు కోటీశ్వరులు అవడం ఖాయం… చంద్రబాబు కుళ్లి కుళ్లి ఏడవడం ఖాయం.
– ప్రభుత్వ సలహాదారు సజ్జల… pic.twitter.com/k1GdHklsXF
— YSR Congress Party (@YSRCParty) July 22, 2023