Kumkuma Puvvu February 6 2024 Episode 2097: అమృత కావేరితో ఇల్లు వదిలి వెళ్లిపోయిన అంజలి బంటి బయట ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎలా ఉన్నారో ఏంటో నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు గాని బంటి అంజలి యుగంధర్ చేతికి దొరికితే మాత్రం వాళ్లని ఉప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తాడు ఆ యుగంధర్ ఇలా ఇంట్లోనే కూర్చుంటే ఎటుపోద్దు పోవడం లేదు మనసంతా బాధగా ఉంది మనం ఏదైనా అమ్మవారి గుడికి వెళ్లి మన బంటిని అంజలిని కాపాడమని అమ్మవారికి చెప్పుకుందాం అక్కడ కాసేపు కూర్చొని వద్దాం పదండి అంటుంది. కావేరి అరుణ్ తో అవున్రా తమ్ముడు ఇలా ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చుంటాము కాసేపు అలా బయట తిరిగి వద్దాం పదా అంటుంది. అరుణ్ కుమార్ సరే అలాగే వెళ్దాం అక్క గుడికి వెళ్దామా అని అంటాడు.
చంద్రం అలాగే బామ్మర్ది గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్దాం పదా అని అంటాడు.కావేరి అరుణ్ కుమార్ వాళ్ళు కలిసి గుడికి వెళ్లడానికి బయటికి వస్తారు.వాళ్ల ఇంటి బయట పోలీసులు కాపలా కాస్తూ ఉండడం చూస్తారు. అరుణ్ కుమార్ పోలీస్ వాళ్ల దగ్గరికి వెళ్లి ఏంటండీ కానిస్టేబుల్ గారు మీరేంటి మా ఇంటి ముందు ఇలా కాపలా కాస్తున్నారు అని అడుగుతాడు. కానిస్టేబుల్స్ సార్ ఏసిపి యుగంధర్ గారు మీ ఇంటి మీద ఒక నిగా పెట్టి ఉంచమని మమ్మల్ని పంపారు మా డ్యూటీ మేము చేయాలి కదా సర్ మీరు ఎటు వెళ్లిన మీ వెంటే మేము వస్తాము మీ ఇంటిల్ కి ఎవరు వచ్చినా వాళ్ళని ఎంక్వయిరీ చేసి వెంటనే మా సార్ కి చెప్పాలి అని అంటాడు.
కావేరి సరిపోయింది సక్కదనం ఇంకేంటి గోతి కాడి నక్కలాగా మా అంజలి బంటి ఎప్పుడే ఎప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురుచూస్తూ కూర్చుంటారా ఏంటి అలాగని మేము ఎటు బయటికి వెళ్లకుండా ఉండాలా ఒకవేళ వెళ్తే మా వెంట మీరు వస్తారా ఏ ఎందుకు అది చూసి చుట్టుపక్కల వాళ్లంతా మేము ఏదో తప్పుడు పని చేసాము అని అనుకోవడానికి చాల్లేగాని వెళ్ళండి అని అంటుంది. కానిస్టేబుల్ లేదు మేడం మా ఎ సి పి గారు చెప్పేంతవరకు మీరు ఎటు వెళ్లిన మీ వెంటే మేము వస్తాం. మీ ఇంటి ముందు కాపలా ఉంటాం అని అంటాడు అమృత చ ఇదేంటి వదిన వీళ్ళు మనల్ని బంక పట్టుకున్నట్టునారు ప్రశాంతత కోసం బయటికి వెళ్లిన మన వెంట వస్తాను అంటున్నారు ఇదేమి బాగోలేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటుంది. కావేరి ఇంకా చేసేదేముంది అమృత రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్లు ఇంకేం చేస్తాం తిరిగి ఇంట్లోకి వెళ్దాం పదండి అంటూ ఇంట్లోకి వెళ్లిపోతారు.
కట్ చేస్తే శాంభవి లాయర్ తో మాట్లాడడానికి హైదరాబాద్ వస్తుంది.శాంభవిని చూసిన లాయర్ రండి శాంభవి గారు ఏంటి ఇలా వచ్చారు కూర్చోండి అని అంటాడు. శాంభవి అదే లాయర్ గారు మీకు తెలిసిన విషయమే మా మామయ్య జై చంద్ర గారు ఇరవై ఐదు ఏళ్ల గడువు పెట్టారు కదా ఇప్పుడు ఆ గడుపు పూర్తి అవడమ్ దగ్గర పడింది. ఇక ఆయన వారసులు ఎవరూ రాలేదు కాబట్టి ఆ ఆస్తికి నేనే వారసురాల్ని అవ్వాలి అందుకు సంబంధించిన వివరాలు మాట్లాడడానికి వచ్చాను ఇదిగోండి మామయ్య గారు అప్పుడు డాక్యుమెంట్స్ కు సంబంధించిన ఫైలు ఒకటి నా దగ్గర మరొకటి మీ దగ్గర పెట్టారని చెప్పారు ఇదిగోండి నా దగ్గర ఉన్న ఈ ఫైల్ తీసుకుని ఆ ఆస్తి నా పేరు మీదికి ట్రాన్స్ఫర్ చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేయండి అని అంటుంది.
లాయర్ ఏంటి శాంభవి గారు మీరు చెప్పేది జై చంద్ర గారు ఆ ఆస్తి వారసులకి దక్కలని రాశాడు కానీ ఒకవేళ వారసులు రాని యెడల ఆస్తి అనాధ శరణాలయానికి అలాగే నిరుపేదలకు వర్తించాలని క్లియర్గా పేపర్ల మీద రాసి పెట్టారు మరి అలాంటప్పుడు నేను ఆస్తిని మీ పేరు మీదికి ఎలా ట్రాన్స్ఫర్ చేయగలను నేను అలా చేయలేను జై చంద్ర గారి ఆశయాని మోసం చేయలేను అని అంటాడు. శాంభవి చూడు లాయర్ నీకు న్యాయం చెప్పడమే తెలుసు కానీ నాకు ఆ న్యాయాన్ని డబ్బుతో ఎలా కొనాలో కూడా నాకు తెలుసు ఇంకా గడువు ఉంది కదా ఆ గడువు పూర్తి అయ్యేలోపు ఏం చేస్తానో చూడు అంటూ లాయర్ కి వార్నింగ్ ఇచ్చి వెళుతుంది శాంభవి.
కట్ చేస్తే అంజలి బంటి ఒక గుడి దగ్గర మెట్ల మీద కూర్చుని బాధపడుతూ ఉంటారు బంటి అంజలి వైపు చూస్తూ అంజలి నీకు ఆకలి వేస్తుందా దాహంగా ఉందా నేను వెళ్లి ఏమైనా తీసుకురానా అని అడుగుతాడు అంజలి అవసరం లేదు బండి నాకు వాటర్ మాత్రం చాలు అంటుంది. బంటిఅలాగే అంజలి నీకోసం ఇప్పుడే వాటర్ తీసుకుని వస్తాను అంటాడు. అంజలి ఇలా చూడు బంటి నన్ను చేసుకోవడం వల్లే కదా రా నీకు ఈ కష్టాలు అన్ని అని అంటుంది.బంటి లేదు అంజలి నేను నీ మాట వినకపోవడం వల్లే ఈ కష్టాలు అన్ని అని అంటూ సరే అంజలి ఇప్పుడే వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను అని బంటి వాటర్ బాటిల్ కోసం బయటికి వెళ్తాడు అంజలి గుడి దగ్గర కూర్చుని ఉంటుంది. యుగంధర్ ఏసిపి అంజలి గంటి కోసం సర్చింగ్ మొదలు పెడతాడు వాళ్ళని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు