Madhuranagarilo సెప్టెంబర్ 22 ఎపిసోడ్ 164: పండు నేను బయటికి వెళ్లి టిఫిన్ తెస్తాను టిఫిన్ తిన్నాక టాబ్లెట్ వేసుకుందువు గాని అని శ్యామ్ అంటాడు. టిఫిన్ బయట నుండి తేవడం ఎందుకు నేను చేస్తానులే అని రాదా అంటుంది. పండు కి దెబ్బ తగిలినప్పుడు నుండి నువ్వు ఏమి తినకుండా రాత్రంతా నిద్ర పోకుండా ఉన్నావు రెస్ట్ తీసుకో నేను వెళ్లి ఐదు నిమిషాల్లో టిఫిన్ తెస్తాను అని శ్యామ్ వెళ్ళిపోతాడు. మమ్మీ మా ఫ్రెండు చాలా మంచివాడు కదా అని పండు అంటాడు. అవున్రా మీ ఫ్రెండ్ లాంటివాడు ఇంకెవరూ ఉండడు అని రాధా అంటుంది. కట్ చేస్తే ఇంకా లేట్ చేస్తే వీళ్ళందరూ శ్యాముకు దగ్గర అయిపోతారు ఎలాగైనా సరే రాదని ఇక్కడ నుంచి పంపించేయాలని సంయుక్త మధుర ఇంటికి వెళుతుంది. ఇంతలో మధుర ఏడుస్తుంది ఏంటి మధుర ఏడుస్తున్నావు అని ధనుంజయ్ అంటాడు. ఏమీ లేదండి పండుకు అలా జరిగింది నా మనసు తట్టుకోలేక పోతుంది అని మధుర అంటుంది.
ఆ సంయుక్త మాటలు విని పండు మీద ద్వేషాన్ని పెంచుకున్నావు కాని నీకు పండు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అని ధనుంజయ్ అంటాడు. చూడండి పండు నా సొంత మనవడి కంటే ఎక్కువ అని మధుర అంటూ ఉండగా. సంయుక్త వచ్చి అత్తయ్య మీరు పండు మీద ఎక్కువగా ప్రేమ పెంచుకుంటున్నారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి రాదని పండుని పంపించేసేయండి లేదంటే మీరు చాలా బాధపడతారు అని సంయుక్త అంటుంది. అది జరగని పని అమ్మ పండుని మర్చిపోవడం కుదరదు అని మధుర అంటుంది. అదేంటి అత్తయ్య అలా అంటారు అని సంయుక్త అంటుంది. సంయుక్త నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు లేదంటే బాగోదు అని ధనుంజయ్ అంటాడు.
అలా ధనుంజయ్ అనగానే సంయుక్త సారీ చెప్పి వెళ్ళిపోతుం ఈ రాదని తొందరగా పంపించేయాలి అనుకుంటూ ఉండగా రాద ఎదురు వస్తుంది. రాధా పండుకు ఇప్పుడు ఎలా ఉంది అని సంయుక్త అడుగుతుంది. ఇప్పుడు బాగానే ఉన్నాడు అని రాదా అంటుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్లక పోతే పండును చంపేస్తాను అని బెదిరిస్తే నువ్వు ఏం చేస్తావ్ అని సంయుక్త అంటుంది. ఏదైనా ఉంటే నాతో తేల్చుకో అంతేకానీ పండు జోలికి వస్తే నిన్ను చంపేస్తాను అని రాదా అంటుంది నిన్ను ఇక్కడి నుండి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు అని సంయుక్త అంటుంది. నన్ను పంపించడం మధుర ఆంటీ వల్లనే కాలేదు నువ్వు ఎంత అని రాదా వెళ్లిపోతుంది. కట్ చేస్తే రాధా డిన్నర్ తెచ్చాను తిను అని శ్యామ్ అంటాడు. డిన్నర్ మీరెందుకు తెచ్చారు సార్ పొద్దున చేసిన ఇడ్లీలు ఉన్నాయి అవే తినే దాన్ని కదా అని రాదా అంటుంది.
ఆ రెండు ఇడ్లీలు తింటే ఏం సరిపోతుంది రాదా ఇప్పటికే నీరసంగా ఉన్నావు అని శ్యామ్ అంటాడు. సార్ అయితే మీరు కూడా తినండి అని రాదా అంటుంది. సరే అని అంటాడు శ్యామ్ అంటాడు. అందరూ కలిసి భోజనం చేస్తారు.వాళ్లనే గమనిస్తూ ఉన్న సంయుక్త వీళ్ళని ఇంత సంతోషంగా ఉండనివ్వకూడదు కట్ చేయాలి వీళ్ళ రిలేషన్ ని రాదని ఇక నుంచి ఎలాగా పంపించేది అని తన మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే మధుర నిద్ర పోతూ పండు కి అలా జరిగింది ఏంటో అని ఆలోచిస్తూ నిద్రపోతుంది ఆ నిద్రలో మళ్ళీ పండు కింద పడిపోయినట్టు కల వస్తుంది
ఏంటి వాడు హాస్పిటల్ నుంచి కోలుకొని వచ్చాక కూడా నాకు ఈ కల వస్తుంది భగవంతుడా వాడికి ఏం జరగకూడదు అని మధుర దండం పెట్టుకుంటుంది. కట్ చేస్తే అమ్మ తల బాగా నొప్పి లేస్తుంది అమ్మ అని పండు అంటాడు. అవునా ఎందుకు నాన్న తలకి బాగా గాయం అయింది కదా అందుకే నొస్తుందేమో పద డాక్టర్ కి చూపిద్దాము అని రాధా పండుని తీసుకొని వెళుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది