Malli Nindu Jabili February 5 2024 Episode 564: ఎస్ఐ గారు నాకు ఒక అతని మీద అనుమానం ఉంది వచ్చి అతని మీద కేసు పెడదామనుకుంటున్నాను అని వసుంధర ఎస్సై కి ఫోన్ చేసి చెబుతుంది. మర్డర్ జరిగి రెండు రోజులు అవుతుంది మేడం ఇప్పటికి ఆలస్యమైంది తొందరగా రండి లేదంటే హంతకుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు అని ఎస్ఐ అంటాడు. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని వసుంధర వెళుతూ ఉండగా వసుంధర గౌతమ్ మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు అని శరత్ అంటాడు. నా అల్లుని చంపిన వాణి వదిలిపెట్టను అని వసుంధర అంటుంది. గౌతమ్ నీ మేనల్లుడు అని శరత్ అంటాడు. నా మేనల్లుడు అయిన సరే నా రివేంజ్ ఇలాగే ఉంటుంది అని వసుంధర అంటుంది. అమ్మగారు గౌతమ్ బాబు ఎలాంటివాడు మీకు తెలుసు కదా అని మీరు అంటుంది.
అన్ని ఆలోచించుకునే నిర్ణయం తిసుకుని వెళ్తున్నాను లెక్కలు తేల్చుకోవడానికే వెళుతున్నాను నీ కూతురు లెక్కలు కూడా తేలిపోతాయి అని వసుంధర అంటుంది. మీరు పంతానికి పోతే నా కూతురు కోసం నేను పోరాటం చేయాల్సి వస్తది అని మీరా అంటుంది. ఎవరి తరపున న్యాయం ఉంటే వాళ్లే గెలుస్తారు అని వసుంధర అంటుంది. వసుంధర నాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వు నేను నేరస్తుని పట్టుకుంటాను ఆ తరువాత నేను నిన్ను ఆపను అని శరత్ అంటాడు. ఇప్పుడు నేను ఆగిపోతే ఎంత మందికి కలిసి వస్తుందో నాకు తెలుసు నేను ఆగను అని వసుంధర అంటుంది. ఎక్కడికి బయలుదేరావ్ మామ్ అని మాలిని అంటుంది. గౌతమ్ మీద కేసు పెట్టడానికి వెళ్తున్నాను అని వసుంధర అంటుంది. గౌతమ్ మీదనే కేసు పెట్టకు జనరల్ గా పెట్టు పోలీస్ ఎంక్వైరీ లో తెలుస్తుంది అని మాలిని అంటుంది. మేము అదే చెప్తున్నామమ్మా అని మీరా అంటుంది.
ఒక మనిషిని టార్గెట్ చేసి కేసు పెట్టకూడదు నా భర్తను చంపిన వాడిని నేను ఊరికే వదిలిపెట్టను అని మాలిని అంటుంది. ఏమైంది మాలిని నీకు నువ్వు కూడా నన్ను వెనక్కు లాగుతున్నావ్ గౌతమే హత్య చేశాడని నాకు గట్టి నమ్మకం అని వసుంధర అంటుంది. ఆ మల్లి గాని బయటికి పిలిచి నీ మనసు మార్చిందా అని వసుంధర అంటుంది. ఎవరో ఏదో చెప్తే నమ్మేదాన్ని కాదమ్మా దయచేసి ఒకసారి నా మాట విను అని మాలిని వెళ్ళిపోతుంది. వసుంధర కోపంగా బయటికి వెళుతుంది. బాబు గారు గౌతమ్ బాబు మీద కేసు పెట్టొద్దని మీరైనా చెప్పండి అని మీరా అంటుంది. మాలిని చెప్తేనే వినట్లేదు ఇక నేను చెప్తే ఎలా వింటుంది అని శరత్ అంటాడు. మాలిని మల్లి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది.
కట్ చేస్తే, గౌతమ్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎక్కడ జాబ్ దొరకదు ఒకచోట సూపర్వైజర్ కావాలని బోర్డు పెట్టి ఉంటే అక్కడికి వెళ్లి అడుగుతాడు గౌతమ్. రెండు గంటల క్రితమే వేరే అతను వచ్చి జాయిన్ అయ్యాడు తమ్ముడు ఇక్కడ ఏ జాబ్ ల్ లేవు అని అతను అంటాడు. గౌతమ్ నిరాశపడి వెళుతూ ఉండగా అక్కడ మూటలు మోస్తూ కూలీలు కనపడతారు అతని దగ్గరికి వెళ్లి మూటలు మోసే పని చేస్తాను సార్ అని అడుగుతాడు. చూస్తుంటే చదువుకున్న వాడిలా ఉన్నావ్ ఆ మూటలు నువ్వు మోయలేవు అని అతను అంటాడు. నాకు ఈ పని చాలా అవసరం సార్ అని గౌతమ్ రిక్వెస్ట్ చేయడంతో సరే వెళ్లి పని చేసుకో అని ఒక అతని పిలిచి గౌతమ్ కి పని చెప్పమని చెప్తాడు. అతను తీసుకువెళ్లి గౌతమ్ భుజం మీద మూట ఎత్తుతాడు.
మూటని మోయలేక కాళ్లు తడబడుతూ సందుల్లో నడుచుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. కట్ చేస్తే, మల్లి ఇంటికి వస్తుంది. అయిపోయాయా తిరుగుళ్ళు అని కౌసల్య అంటుంది. బలద్దురుగా తిరగడానికి వెళ్లలేదా అత్తయ్య అని మల్లి అంటుంది. నువ్వు ఎప్పుడూ ఉద్యోగం వెలగబెడతావు మమ్మల్ని బాగా చూసుకుంటానన్నావ్ నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు నా కొడుకు కాలు బాగో లేకపోయినా జాబ్ చేయడానికి వెళ్ళాడు అని కౌసల్య అంటుంది.మాలిని అక్క తో మాట్లాడడానికి వెళ్లాను వసుంధర అమ్మగారు కేసు పెట్టకుండా మాలిని అక్కతో మాట్లాడాను అని మల్లి అంటుంది. మాలిని వదిన ఏమన్నది అని నీలిమ అంటుంది. ఆలోచిస్తానని చెప్పింది అని మల్లి అంటుంది.
నీ మాటలతో ఎవరినైనా మాయ చేస్తావు అలాగే కదా గౌతమ్ ని మార్చేసి నీ వెంట తిప్పుకుంటున్నావు అని కౌసల్య అంటుంది. ఎందుకత్తయ్య అలా మాట్లాడుతున్నారు అని మల్లి అంటుంది. నీ జాతకం ఏంటో కానీ నా కొడుకు ఈ కేసులో ఇరుక్కున్నాడు నీ మీద మంచి అభిప్రాయం నాకు ఈ జన్మలో కలగదు అని కౌసల్య కోపంగా వెళ్ళిపోతుంది.అన్నయ్య అర్థం చేసుకున్నట్టే అమ్మ కూడా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటుంది నువ్వు లోపలికి రా వదిన అని నీలిమ అంటుంది. కట్ చేస్తే, మాలిని మల్లి కి ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టే అమ్మ గౌతమ్ మీద కేసు పెట్టడానికి వెళుతూ ఉండగా ఆపాను అని మాలిని అంటుంది. వసుంధర అమ్మగారు ఏమన్నారు అక్క అని మల్లి అంటుంది. మామ్ చేయాల్సింది చేస్తుంది అని మాలిని అంటుంది. చాలా థాంక్స్ అక్క ఆయన ఏ ఇబ్బందుల్లో ఇరుక్కోడు అని మల్లి అంటుంది. సరే ఉంటాను అని మాలిని ఫోన్ కట్ చేస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది