Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు ఇలా అనేక భాషలకు చెందిన సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉంటాయి. వెబ్ సిరీస్ లకు ఇతర భాషల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే కేవలం తెలుగు భాషలో స్ట్రీమింగ్ చేసే ఓటీటీ సంస్థలు మాత్రం చాలా అరుదు. ప్రస్తుతం తెలుగు భాషలో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లోడ్స్ స్ట్రీమింగ్ చేసే ఓటిటి సంస్థలు రెండే ఉన్నాయి. వాటిలో ఒకటి ఆహా మరొకటి ఈ టీవీ విన్. ఈ రెండు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో అతి ఎక్కువ తెలుగు కంటెంట్ ను అందుబాటులో ఉంచుతూ దూసుకుపోతున్నాయి ఈ ప్లాట్ఫార్మ్స్. అలాంటి ఈటీవీ విన్ ఓటీటీలో ఇటీవల ఒక్క రోజే రెండు సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో ఒకటి తెలుగు స్ట్రైట్ ఫిలిం కాగా మరొకటి తమిళ్ డబ్ మూవీ. ఈటీవీ విన్ లో గురువారం నుంచి చిత్రం చూడరా, పార్థు అనే రెండు సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. హీరో వరుణ్ సందేశ్, జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజు.. నటుడు కాశి విశ్వనాధ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గారు పొందింది.
ఇక ఈ మూవీకి ఆర్ఎన్ హర్షవర్ధన్.. కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. ఇక ఇందులో వరుణ్ సందేశ్ కు జోడిగా శీతాల్ బట్ హీరోయిన్ గా చేసింది. వీరితోపాటు రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, మీనా కుమారి, అన్నపూర్ణ, రచ్చ రవి తదితరులు కీలకపాత్రను పోషించారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. సినిమాల్లోకి వెళ్లాలని ఆశతో పల్లెటూరి నుంచి హైదరాబాద్కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు తమకు ఎటువంటి సంబంధంలేని దొంగతనం కేసులో ఇరుక్కుపోతారు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందింది.
ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోకి రావడం విశేషం. ఇక తెలుగులో పార్థు టైటిల్ తో ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చిన తమిళ్ డబ్బింగ్ సినిమా ఓ మై సెన్నై. సైకో థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా 2021 లో థియేటర్లలో విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. తమిళ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ అసిస్టెంట్ అర్జున్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ సినిమాతో వరుణ్ సందేశ్ మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. గతంలో కొత్త బంగారులోకం వంటి సినిమాలతో ఫుల్ ఫేమస్ అయిన ఈ హీరో ప్రస్తుతం తన జోరును కొంచెం తగ్గించాడు. సరైన విజయాలు లేకపోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక తాగజాగానే ప్రియంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నాడు.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!