AP Elections 2024: జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కేసులో కూటమికి హైకోర్టులో ఊరట లభించలేదు. జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు, స్వతంత్రులకు కేటాయించకుండా ఆదేశించాలని కోరుతూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
జనసేన పార్టీకే గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇతర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తే కూటమి నష్టపోతుందని తెలిపారు. ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వడం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని.. ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని ఈసీ తరపు న్యాయవాది వాదించారు.
గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో కనుక్కొని సాయంత్రం నాలుగు గంటలకు కోర్టుకు చెప్పాలని ఎలక్షన్ కమిషన్ న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. నాలుగు గంటల పాటు వాయిదా వేసింది. తిరిగి విచారణ ప్రారంభం అయిన తర్వాత ప్రస్తుత పరిస్థితిని ఈసీ తరపు న్యాయవాది వివరించారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. జనసేన పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్ధులకు గుర్తులు కేటాయింపు జరిగిందని, ఈ దశలో ఇతర అభ్యర్ధులకు కేటాయించిన సింబల్ ను మార్చలేమని ఈసీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ను ఇప్పటికే పంపిచామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తి అవ్వడంతో సోమవారం విచారణలో ఉన్నత న్యాయస్థానం ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంట నెలకొంది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వర్గీయులే స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసి గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల గుర్తుగా తీసుకోవడంతో కూటమి నేతల్లో ఆందోళన నెలకొంది.
CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు