Arvind Kejeiwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరో సారి సమన్లు జారీ చేశారు. గతంలో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనిలాండరింగ్ కు సంబంధించి ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసిన ఈడీ .. ఈ సారి ఢిల్లీ జలమండలిలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులో సమన్లు జారీ చేసింది. ఈ కేసులో మార్చి (ఈ నెల) 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హజరుకావాలని అందులో పేర్కొన్నారు. కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు ఇవ్వడం వరుసగా ఇది తొమ్మిదో సారి.
ఇంతకు ముందు ఈడీ సమన్లకు కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఈడీ ఢిల్లీ కోర్టలో రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై శనివారం విచారణ సందర్భంగా కోర్టు ముందు హజరయ్యారు. చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరైన మరుసటి రోజే తాజాగా మరో కేసులో కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. తొలుత ఈ సమన్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి జారీ చేసినట్లుగా వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ఆప్ నేతలు ఖండించారు.
తాజా సమన్లు ఢిల్లీ జలమండలికి సంబంధించిన కేసులో జారీ చేసినట్లు ఢిల్లీ మంత్రి అతిశీ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఆయన్ను ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ పన్నిన కుట్రలో భాగామే తాజా సమన్లు అని మంత్రి అన్నారు. గతంలో కూడా కేజ్రీవాల్ ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకే ఢిల్లీ మద్యం కేసులో సమన్లు జారీ చేశారని ఆరోపించారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేయలేమని భావించి కేంద్రం మరో తప్పుడు కేసుతో ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తొందన్నారు.
అయితే ..ఇప్పటి వరకూ అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు పలు మార్లు నోటీసులు జారీ చేసినా ఏదో కారణాలు చెప్పి హజరు కాలేదు. తాజాగా మరో సారి సమన్లు జారీ చేయడంతో 21న కేజ్రీవాల్ విచారణకు హజరు అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది
BRS MLC Kavita: కవితకు ఈడీ మరో షాక్