ఆర్. నారాయణమూర్తి స్నేహ చిత్ర పిక్చర్స్ బేనర్పై నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మేలో విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ”మా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మేలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. విజయనగరం, బొబ్బిలి, ఆలూరు, కాకినాడ, విశాఖపట్నం తదితర ప్రదేశాల్లో షూటింగ్ జరిపాం. షూటింగ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు విలువను తెలియజేసే చిత్రం ఇది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం. భవిష్యత్తు తరాల మనుగడకి ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే కథనంతో ఈ చిత్రం చేశాం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను ఈ చిత్రంలో చూపించాం. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి సినిమాను మే నెలలో రిలీజ్ చేస్తాం. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
previous post
next post