సీనియర్ నటుడు రాధారవి .. నయనతారను ఉద్దేశించి సీత, దెయ్యం అంటూ కామెంట్స్ చేస్తూ శనివారం ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలు రాధారవికి పెద్ద సమస్యగా మారాయి. ఆయన్ని డిఎంకె పార్టీ.. పార్టీ నుండి తొలగించింది. రాధికా శరత్కుమార్, వరలక్ష్మి శరత్కుమార్, విఘ్నేష్, తాప్సీ, సిద్ధార్థ్, విశాల్ ఇలా అందరూ రాధారవి చర్యను తప్పు పట్టారు. రాధారవి కూడా నయనకు బాధించి ఉంటే క్షమించాలంటూ క్షమాపణలు కోరారు. చివరకు రాధారవికి నయనతార బుర్ర తిరిగే స్టయిల్లో సమాధానం చెప్పింది. సోషల్ మీడియా ద్వారా ప్రెస్నోట్ను విడుదల చేసింది.
“ఇలాంటి వారిని చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తున్నంత కాలం మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. నేను సినిమాల్లో సీత, దెయ్యం, భార్య, ప్రేయసి ఇలా ఏ పాత్ర వేసినా వినోదం పంచడానికి మాత్రమే. నేనేంటో నా పని చెబుతుంది. వృత్తిపరంగా దేవుకు నాకు చాలా అవకాశాలు ఇస్తున్నాడు. నడిగర్ సంఘం సుప్రీంకోర్టు ఆదేశాల సారం అంతర్గత పిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తే బావుంటుంది. ప్రతిసారి ఇలా ప్రెస్నోట్స్ ఇవ్వలేను. ఈ అంశాలు బయటకు వచ్చి స్పందించేలా చేస్తాయి.
డిఎంకె అధ్యక్షకుడు స్టాలిన్గారు ముందుగా స్పందించి రాధారవి అనే వ్యక్తిని పార్టీ నుండి తొలగించారు. రాధారవికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు జన్మనిచ్చింది కూడా మహిళే. మహిళలను తక్కువ చేసి మాట్లాడటం మగతనం కాదు. యువతకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి నీచమైన వ్యక్తులకు ఉదాహరణగా నిలుస్తున్నాడు. చేతిలో సినిమాలు లేక పాపులారిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు“ అన్నారు నయన్.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!