రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైంది. పోటీ చేయబోయే సీట్ల స్థానాలపైనా దాదాపు స్పష్టత వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఈ స్థానానికి బీజేపీ కన్వీనర్గా వ్యవహరిస్తున్న గారపాటి సీతారామాంజనేయ చౌదరి(తపన) సిద్ధపడుతున్నారు. ఈ స్థానం ఆయనకు దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు. బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న సుజనా చౌదరి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు.
అయితే, అనూహ్యంగా తపన చౌదరికి ఈ సీటు దాదాపు ఖరారు అయినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా యి. బీజేపీలో ఎంతో మంది సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు ఉన్నప్పటికీ అనూహ్యంగా తపన చౌదరి వైపు పార్టీ మొగ్గుచూపతుండడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరీ తపన చౌదరి అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. గడిచిన 15 ఏళ్లుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు పరిధిలో తపన చారిటబుల్ ట్రస్ట్ పేరుతో గారపాటి సీతారామాంజనేయ చౌదరి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
నిరుపేదలకు ఆర్థిక సహాయం, చిన్నారులకు విద్యా పరమైన సహకారం, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. బీజేపీలోనూ ఆయన గత కొన్నాళ్లుగా యాక్టివ్గా పని చేస్తు న్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావడంతో ప్రజల్లోనూ ఆయనకు పలుకబడి ఉంది. మిగిలి న నేతలతో పోలిస్తే పెద్ద సంఖ్యలో అనుచర గణం ఉండడం కూడా తపన చౌదరిని రానున్న ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించాలని అధిష్టానం యోచిస్తున్నట్టు చెబుతున్నారు.
ఇదే సీటును మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆశించి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించారు. అయి నా ఆయన్ను కాదని.. తపన చౌదరి వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపిందంటే ఆయన ఏ స్థాయిలో పార్టీ లో సత్సంబంధాలు కలిగి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఏలూరు పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజవర్గాల్లో ఆయన గత కొన్నాళ్లు నుంచి జోరుగా తిరుగుతున్నారు. ఆయా నియోకజవర్గాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
ఒకవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు తపన సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను సాగిస్తూ ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక, అంగ బలం కలిగిన నేతగా, అంతకుమించి బీజేపీకి విధేయుడిగా ఉన్న గారపాటి వైపు బీజేపీ మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు.