వచ్చే ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీల వ్యూహం బా గానే ఉంది. అయితే.. దీనివల్ల వైసీపీకి పోయేదేంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం టీడీపీ నాయకు లు చెబుతున్న దాని ప్రకారం.. వైసీపీ అధికారంలో నుంచి దిగిపోతుందని. ఇది నిజమేనా? అనే కొంత ఆలోచిం చాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే.. 2014లో ఈ మూడు పార్టీలూ కలిసి పనిచేశాయి. అదికారంలోకి కూడా వచ్చాయి. అయినప్పటికీ.. 67 స్థానాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది.
ఆ ఫలితంతో పోల్చితే.. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు మరింత కీలకంగా మారాయి. అప్పట్లో జగన్ కొత్త నాయకుడు. పైగా.. ఆయన అదికారంలోకి వస్తే.. ఏం చేస్తాడు? అనేదిప్రజలకు పెద్దగా తెలియదు. మరో వైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు.. ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ వంటి వారు ఉన్నా రు. అయినా కూడా… ప్రజలు 2014 ఎన్నికల్లో వైసీపీకి 67 స్థానాలు కట్టబెట్టారు. ఇదేమీ చిన్న విషయం కాదు. అలాంటిది ఇప్పుడు గత ఐదేళ్లుగా ప్రజలు జగన్ పాలనను చూశారు.
జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజల్లో మెజారిటీ సామాజిక వర్గాలు లబ్ధి పొందాయి. పార్టీలకు అతీతంగా కూడా ఈ లబ్ధి చేకూరింది. అదేసమయంలో పాఠశాలలు, వైద్య రంగం వంటివాటిని ప్రజలకు చేరువు చేశారు. ముఖ్యంగా వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంట్లో కూర్చుంటేనే అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు అనేక రూపాల్లో మేలు జరుగుతోంది. ఈ నేపథ్యం లో 2014 ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి జగన్ గ్రాఫ్ పెరిగిందే కానీ తగ్గలేదు.
పైగా.. జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నాడనే సానుభూతి కూడా మరింత పుంజుకుంది. ఈ నేపథ్యంలో మూ డు పార్టీలు ఏకమై ముందుకు సాగినా.. జగన్ మెజారిటీ తగ్గడం కష్టమనే భావన ఉంది. 2014లో 67 స్థానాలు తెచ్చుకున్న వైసీపీ.. ఇప్పుడు కనీసంలో కనీసం 90-100 స్థానాల్లో అయినా విజయం దక్కించుకో కపోతుందా? అనేది మెజారిటీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే.. మూడు పార్టీల పొత్తును లైట్ తీసుకునే అవకాశం లేదని కూడా అంటున్నారు. వారి వ్యూహాలు వారికి ఉంటాయని చెబుతున్నారు.