టీడీపీలో ఎంతో మంది నాయకురాళ్లు ఉన్నారు. వారిలోనూ ఒకరిద్దరు ఫైర్ బ్రాండ్ నాయకురాళ్లు కూడా ఉన్నారు. ఉదాహరణకు.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఎస్సీ నాయకురాలు.. బండారు శ్రావణి తొలి వరుసలో ఉంటారు. అయితే.. వీరిని మించి అన్నట్టుగా గతంలో గుంటూరు కేంద్రంగా నిర్వహించిన మహానాడులో తొడగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు.. గ్రీష్మ ఉన్నారు. వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. ఆమె అప్పట్లో తొడగొట్టిన సంగతి తెలిసిందే.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం ఎస్సీ నియోజకవర్గం నుంచి గ్రీష్మ టికెట్ ఆశిస్తున్నారు. రెండేళ్లుగా ఇక్క డ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తెగా ఆమె రాజకీయ అరం గేట్రం చేయాలనేది గ్రీష్మ కోరిక. దీనికి తొలి నాళ్లలో పార్టీ నుంచి ఎంకరేజ్మెంట్ లభించింది. దీంతో ఆమె రెచ్చిపోయారు. కానీ, తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి.. దాదాపు ఆమెను పక్కన పెట్టేశారు. ఇక్కడ టికెట్ను మాజీ మంత్రి కోండ్రు మురళికి దాదాపు ఖాయం చేసినట్టు ప్రచారంలో ఉంది.
పలు సమీకరణలు, ఈక్వేషన్లు చూశాక రాజాంలో పార్టీ విజయం సాధించాలంటే గ్రీష్మ కంటే మురళీయే బెటర్ అని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పైగా గత రెండు ఎన్నికల్లోనూ అక్కడ వైసీపీ వరుస విజయాలు సాధిస్తోంది. పైగా ఈ సారి అక్కడ వ్యతిరేకత ఎదుర్కొంటోన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులును విశాఖ జిల్లాలోని పాయకరావుపేటకు మార్చేసింది. దీంతో ఇప్పుడు అక్కడ వైసీపీకి ప్రెష్ క్యాండెట్ ఉన్నారు. దీంతో ఈ సీటు గెలవాలంటే టీడీపీ మరింత బలమైన ఈక్వేషన్లతో పాటు బాగా కష్టపడాలి. ఈ క్రమంలోనే గ్రీష్మకు అయితే ఇక్కడ గెలిచే సత్తా లేదన్న నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చేసింది.
తాజాగా పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారాలోకేష్ జిల్లాల పర్యటన ప్రారంబించారు. తొలుత ఆయన శ్రీకాకుళం జిల్లాలోనే పర్యటించనున్నా రు. ఈ క్రమంలో శంఖారావం పేరుతో సభలు పెడుతున్నారు. అయితే.. ఈ సభల ఏర్పాటు విషయంలో కోండ్రు మురళికి ప్రాధాన్యం ఇస్తూ.. పార్టీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అంతా తానై ఆయన రాజాం నియోజకవర్గం నుంచి ఇచ్ఛాపురంలో నిర్వహించే సభకు జనాలను తరలిస్తున్నారు.
ఈ పరిణామంతో తొడగొట్టిన గ్రీష్మకు సర్వం అర్థమైంది. తనను పక్కన పెడుతున్నారంటూ.. ఫేస్బుక్ వేదికగా. కామెంట్లు చేశారు. ఆ వెంటనే ఆమె డిలీట్ చేశారు. ఇప్పటి వరకు తాను పార్టీ కోసం చాలా ఖర్చు చేశానని.. తన కుటుంబాన్ని కూడా వదులుకుని తిరిగానని ఆమె రాసుకొచ్చారు. దీనిలో వాస్తవం ఉన్నప్పటికీ.. స్తానికంగా మార్పు అనివార్యమనేది.. పార్టీ వర్గాలు చెబుతున్న మాట. దీంతో గ్రీష్మకు టికెట్ ఇవ్వరనేది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఆమె పక్క చూపులు చూస్తున్నారనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.