Rajasthan Gang Rape: రాజస్థాన్ లో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 23 మంది మహిళలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అంగన్ వాడీ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి ఇద్దరు తమను గ్యాంగ్ రేప్ చేశారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణ ఘటన బయటకు వచ్చింది.
సామూహిక అత్యాచారం చేశారన్న అభియోగంపై సిరోహి మున్సిపల్ కౌన్సిల్ చైర్ పర్సన్ మహేంద్ర మేవడ, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరి పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రం పాలీ జిల్లాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొద్ది నెలల క్రితం అంగన్ వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో తాను మరి కొందరు మహిళలు సిరోహి ప్రాంతానికి వెళ్లగా, నిందితులు మహేంద్ర మేవడ, మహేంద్ర చౌదరి తమతో మంచిగా ప్రవర్తించి, భోజనం, హాస్టల్ వసతి కల్పించారన్నారు.
అయితే భోజనం చేసిన తర్వాత ఇతర మహిళలతో పాటు తాను కూడా స్పృహ కోల్పోయానని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మెలుకువ వచ్చిన తర్వాత .. భోజనంలో మత్తుపదార్ధాలు కలిపినట్లుగా వారు గ్రహించారు. ఆ తర్వాత వారు ఇద్దరు తమను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారనీ, విషయం బయటకు చెబితే సామూహిక అత్యాచార వీడియోలను లీక్ చేస్తామనీ, తమతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతే కాకుండా తమ నుండి రూ,5లక్షలు డిమాండ్ చేశారని ఫిర్యాదు లో తెలిపింది. ఈ ఘటనపై డీఎస్పీ పరాస్ చౌదరి స్పందిస్తూ.. ఇదే మహిళ గతంలో ఓ తప్పుడు కేసు పెట్టినట్లు తెలిపారు. అయినప్పటికీ ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలతో ఎనిమిది మంది మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
YSRCP: ఈ రాజు గారికి టికెట్ ఇవ్వొద్దు .. ఆచంట వైసీపీ అసమ్మతి నేతల డిమాండ్