అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీమ్ కోర్టు గతేడాది అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ రామ మందిర నిర్మాణానికి ఇప్పుడు పనులు ఊపందుకున్నాయి. ఆగష్టు 3నుండి 5 వరకూ ఆలయ నిర్మాణ పనులు అట్టహాసంగా జరగనున్నాయి.
ఆగష్టు 4న రామాచార్య పూజ జరగనుంది. భూమి పూజకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచ్చేయనున్న విషయం తెల్సిందే. సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు ముహూర్తం నిర్ణయించారు. భూమి పూజలో భాగంగా మొదటి ఇటుకను 22.6 కిలోల స్వచ్ఛమైన వెండితో తయారుచేసారు. దానిపై వివరాలు ఉంచిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయ నిర్మాణానికి మూడున్నరేళ్లు పట్టే అవకాశముందని తెలుస్తోంది.