సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి పథకం దేశ వ్యాప్తంగా చాలా మందిని ఆలోచనలో పెడుతుంది. ఇలాంటి పథకం మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయకూడదు అనే భావనలు పాలకులలో కలుగుతోంది. దానికి కారణం చూస్తే స్వయంగా జగన్ ప్రజలు పడిన కష్టాలను పాదయాత్రలో అదే విధంగా ఓదార్పు యాత్రలో చూడటమే అని చాలామంది అంటున్నారు.
దేశంలో ఏ రాజకీయ నాయకుడు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వని విధంగా జగన్ అయ్యారని, అందువల్లే ఆయన ఆలోచన నుండి ఇలాంటి పథకాలు అమలు అవుతున్నాయి అని చాలామంది వైసీపీ పార్టీలో ఉన్న వాళ్లు అదేవిధంగా జగన్ సన్నిహితులు అంటుంటారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రభుత్వ అధికారులతో “నాడు నేడు” పనులపై జరిగిన సమీక్ష సమావేశంలో జగన్ తన పొలిటికల్ కెరియర్ లో తనని కదిలించినా ఒక ఇన్సిడెంట్ గురించి పంచుకున్నారట.
పూర్తి విషయంలోకి వెళ్తే గిరిజన ప్రాంతాలలో పర్యటించిన సమయంలో అక్కడ హాస్టల్ లో ఉండే విద్యార్థులు నీళ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం చూడటం జరిగిందని, కాలకృత్యాలు కూడా బయటకు వెళ్లే దుస్థితి ఉండేదని కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఎక్కడ ఉండకూడదని హాస్టల్ లో బాత్రూం నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు జగన్ ఆదేశించడం జరిగింది. గిరిజన విద్యార్థుల కష్టాలను కళ్లారా చూశానని అందువల్ల ఎటువంటి ప్రభుత్వ పరిధిలో ఉండే హాస్టల్ వసతుల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదని జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.