రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. అల వైకుంఠపురములో లాంటి క్లాస్ హిట్ తర్వాత అల్లు అర్జున్ ఊరమాస్ క్యారెక్టర్ పుష్ప లో పోషిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్రైవర్ గా కనిపించబోతుండగా.. గిరిజన యువతిగా రష్మిక మందన్న నటిస్తోంది. 5 భాషల్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు.
కాగా ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ అల్లు అర్జున్ లేకుండానే సుకుమార్ తెరకెక్కించారు. అయితే సరిగ్గ రెండవ షెడ్యూల్ ప్రారంభించాలనుకున్న సమయంలో కరోనా ప్రభావంతో షూటింగ్ కొన్ని నెలలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేరళ అడవుల్లో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్లో జరగాల్సింది. ఈ భారీ షెడ్యూల్ లో అల్లు అర్జున్ జాయిన్ కావాల్సి ఉండగానే సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత పలు చోట్ల ఈ షెడ్యూల్ జరపాలని సుకుమార్ ప్లాన్ చేసినప్పటికి కుదరలేదు. ఎట్టకేలకి ఈ సినిమా ఈరోజు నుంచి ( నవంబర్ 10 ) ప్రారంభం అయింది.
కాగా తాజాగా ఈ సినిమా తెలంగాణలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ జరిపేందుకు దర్శకుడు సుకుమార్ సిద్దమయ్యాడు. ఇందుకోసం అటవీ ప్రాంతంలో కొన్ని సెట్స్ కూడా సిద్ధం చేశారు. అల్లు అర్జున్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అటవీ ప్రాంతంలో పోలీసులు పకడ్బంధీగా ఏర్పాటు చేశారు. ఈ లాంగ్ షెడ్యూల్ గనక కంప్లీట్ అయితే సగానికి పైగా షూటింగ్ పూర్తయినట్టే. ఇక గ్యాప్ రాకుండా 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆ సమయానికి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్, మెగాస్టార్ ఆచార్య వంటి భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!