డయాబెటిస్..అనేది చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్నే మధుమేహం, షుగర్, చక్కెర వ్యాధి అని పిలుస్తారు. డాక్టర్లు సూచించిన మందుల తో పాటు సరైన ఆహార నియమాలను పాటిస్తే షుగరు ను అదుపుచేయవచ్చు . రక్తం లోని చెక్కర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు అధిక రక్త పీడనంలాంటి సమస్య లను అదుపు చేయవచ్చు.
మధుమేహం ఉన్నవారు రాగి, గోధుమ తప్ప వరి అన్నము తినకూడదు అనేది ఒక తప్పు అభిప్రాయం. గోధుమ, వరి, జొన్నలు,రాగి, సజ్జలు మొదలైన ధాన్యాలు 70 శాతం పిండి పదార్థం కలిగిఉంటాయి. అందుకే ఏ ధాన్యం తింటున్నాం అనేది ముఖ్యంకాదు. ఎంత పరిమాణం లో తింటున్నం అన్నడి మాత్రమే ముఖ్యం.
అన్నం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం గా భావించడానికి కారణం ఏమిటో తెలుసా? ఏం తిన్నా అన్నం కి సమానం కాదు. అందులోనూ మనం భోజన ప్రియులం. అయితే షుగర్ వ్యాధి వస్తే మాత్రం అన్నం తినకుండా ఉండడం ఉత్తమమని అంటుంటారు. అయితే, ఇందులో కొంత వాస్తవం, కొంత అవాస్తవం ఉంది. అదేంటంటే.. షుగర్ ఉన్నాకూడా అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు..
మితంగా తీసు కుంటే సరి పోతుంది. కానీ ఎక్కువ మోతాదు లో మాత్రం తినరాదు. ఎందుకంటే.. అన్నం లో గ్లిసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని వల్ల బ్లడ్ షుగర్లో మార్పు వస్తుంది. అన్నం తినేటప్పుడు అన్నం మాత్రమే తీసుకోం అందులోపప్పు, కూర, పెరుగు ఇలా అన్నీ కలుస్థాయి. అవి కలవడం వలన గ్లిసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది కాబట్టి అన్నం తిన్న సమస్య ఉండదు .
అయితే, అన్నం తినొచ్చు కదా అని ఎక్కువగా తినకూడదు . కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తింటూ ఉండాలి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. అదేవిధంగా, ఓ పూట అన్నం తింటే ఇంకో పూట చపాతీ, టిఫిన్స్, పుల్కాలు తినాలి. దీనితో పాటు తాజా కూరగాయలు తీసుకోవాలి , నీటిని ఎక్కువగా తాగాలి . వ్యాయామం మాత్రం అసలు మానోద్దు . రోజూ ఓ 30 నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ అయినా చేస్తుండాలి. ఇలా చేస్తుండడం వల్ల షుగర్ మాత్రమే కాదు.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావు