టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమా తో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న మహేష్ స్పీడ్ కరోనా వైరస్ దెబ్బకు బ్రేక్ పడినట్లయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సరికొత్త మేక్ఓవర్ తో మహేష్ బాబు ఈ సినిమాలో కనిపిస్తున్నారు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. మహేష్ నెక్స్ట్ సినిమా ఈ విషయంలో అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “సర్కారు వారి పాట” సినిమా తర్వాత రాజమౌళితో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుండగా, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ త్రివిక్రమ్ .. మహేష్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ లోపే త్రివిక్రమ్ తో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఒప్పుకున్నట్లు అధికారిక వార్త రావడం త్రివిక్రమ్ మహేష్ ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా మళ్లీ అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనిల్ రావిపూడి ఎఫ్ 3 ఒప్పుకోవడంతో అది కూడా కష్టమే అన్న టాక్ వస్తుంది. ఇక చివరిగా మళ్లీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తుందని వార్తలు వస్తున్నాయి. అంత మాత్రమే కాక సుకుమార్ పేరు కూడా వినబడుతుంది. దీంతో మహేష్ అభిమానులు ఫుల్ కన్ఫ్యూజన్లో పడ్డారట. మరి వీరందరిలో “సర్కారు వారి పాట” సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తారు అన్న దాని విషయంలో మహేషే క్లారిటీ ఇస్తే బాగుంటుందని చాలా మంది చెప్పుకొస్తున్నారు.