CM Jagan Meet Governor: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దంపతులు భేటీ అయ్యారు. మార్చి 7వ తేదీ నుండి జరగనున్న ఏపి అసెంబ్లీ సమావేశాల గురించి గవర్నర్ కు సీఎం జగన్ వివరించారు. 7వ తేదీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మార్చి 8న ఇటీవల అకాల మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి ఉభయ సభల్లో సంతాపం తెలియజేయనున్నారు. 11న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Read More: Ukraine Russia War: ఉక్రెయిన్ల మనసు గెలుచుకున్న హర్యానా విద్యార్ధిని..మేటర్ ఏమిటంటే..?
CM Jagan Meet Governor: మార్చి నెలాఖరు వరకూ సమావేశాలు
మార్చి నెలాఖరు వరకూ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు గవర్నర్ కు సీఎం జగన్ తెలియజేసినట్లు సమాచారం. ఇదే క్రమంలో రష్యా – ఉక్రెయిన్ మద్య యుద్ధం జరుగుతున్న తరుణంలో ఉక్రెయిన్ లో ఉన్న ఏపి విద్యార్ధులను తమ స్వస్థలాలకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు వివిధ రాజకీయ అంశాలను కూడా గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం.
మంత్రి వర్గ విస్తరణపై కూడా..?
ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల తర్వాత జగన్ మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుండి వినిపిస్తోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో మంత్రివర్గంలో కీలక శాఖ ఖాళీ అయ్యింది. ఈ శాఖను వేరే వారికి అప్పగించే కన్నా త్వరగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టి పూర్తి స్థాయి మంత్రిని ఈ శాఖకు నియమించాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని తెలిసింది. దాదాపు అరగంట పాటు రాజ్ భవన్ లో సీఎం జగన్ గవర్నర్ తో సమావేశమైయ్యారు.