Krithi Shetty: `అఖండ` సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది.
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలె తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం యంగ్ హీరోయిన్ను సంప్రదించారట. కానీ, ఆమె రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నారు.
ఇంతకీ ఆ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు.. కృతి శెట్టి. `ఉప్పెన` వంటి హిట్ మూవీతో టాలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో వెంటవెంటనే రెండు హిట్లను ఖాతాలో వేసుకుంది. అయితే ఈ కన్నడ ముద్దుగుమ్మను `ఎన్బీకే 107`లో ఓ కీలక పాత్రలో నటించాలంటూ కోరారట.
కానీ, అందుకు ఆమె సున్నితంగా నో చెప్పిందని తెలుస్తుంది. ప్రస్తుతం కృతి శెట్టి కెరీర్ టాప్ స్పీడ్లో దూసుకుపోతుంది. ఇలాంటి తరుణంలో సీనియర్ హీరో సినిమాల్లో నటిస్తే కెరీర్ డల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆమె బాలయ్య మూవీని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!