AP EAP: ఏపీ ఈఏపీ సెట్ షెడ్యుల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద షెడ్యూల్ వివరాలు ప్రకటించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు సంబంధించి తేదీలను వెల్లడించారు. జూలై 4 నుండి 8వ తేదీ వరకూ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్ -2022 పరీక్ష, జూలై 11,12 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
పరీక్షల కోసం గతంలో 136 సెంటర్లలో నిర్వహించామనీ, ఈ సారి అవసరమైతే సెంటర్ల సంఖ్య పెంచుతామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తెలంగాణలోనూ నాలుగు సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్ 11న నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని తెలిపారు. పరీక్షా సమయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇంటర్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యుల్ ఇప్పటికే విడుదల చేశామన్నారు.