Pawan Chiru: 2001వ సంవత్సరంలో ఎస్.జే సూర్య దర్శకత్వంలో వచ్చిన “ఖుషి” బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పవన్ కెరీర్లోనే ఈ సినిమా అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ గా.. అప్పటి బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను తిరగరాసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. రొమాంటిక్ అదేవిధంగా స్టైలిష్ తరహాలో సూర్య.. ఈ సినిమాని తెరకెక్కించి పవన్ కళ్యాణ్ ని చాలా అందంగా చూపించడం జరిగింది. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా చేసిన భూమిక.. తనదైన శైలిలో నటించడం జరిగింది. ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే నడుము సీన్ ఖుషి మొత్తానికి హైలెట్. అయితే ఇదే సీన్ చాలా మంది తర్వాత చేసినా కానీ పెద్దగా పండలేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే ఖుషి నడుము సన్నివేశం.. మెగాస్టార్ చిరంజీవి చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నయి. పూర్తి విషయంలోకి వెళ్తే తమిళంలో “వేదాళం”ని తెలుగులో “బోలా శంకర్” టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో “ఖుషి” లో నడుము సీన్… “భోళా శంకర్” లో చిరంజీవి …యాంకర్ శ్రీముఖి తో డైరెక్టర్ మెహర్ రమేష్ షూట్ చేయడం జరిగిందట. నువ్వు నా నడుము చూసావ్ అని శ్రీముఖి అంటే అసలు అక్కడ నడుము ఎక్కడుంది అన్నీ ముడతలేగా అని ఫన్నీగా మెగాస్టార్ మాట్లాడుకునే సీన్ ఒకటి ఇటీవల షూట్ చేయడం జరిగిందట. ఈ సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో “మహానటి” ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోంది. చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా రెడీ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతాన్ని మహతి సర్వ సాగర్ అందిస్తున్నాడు. తమిళంలో వేదాళం లో అజిత్ నటించడం జరిగింది. అక్కడ సూపర్ డూపర్ హిట్టయ్యింది. అయితే ఈ సినిమా తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్టోరీ లో కొద్దిగా మెహర్ రమేష్ మార్పులుచేర్పులు చేసినట్లు సమాచారం.