NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి సర్కార్ కు కేంద్రం నుండి షాకింగ్ న్యూస్..! సఖ్యతగా ఉన్నా తప్పని తిప్పలు ఎందుకో..?

ఏపిలోని వైసీపీ సర్కార్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఏపీ బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ ను విమర్శిస్తున్నా రాష్ట్ర పర్యటనలకు విచ్చేసిన సందర్భాల్లో కేంద్ర మంత్రులు మాత్రం వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తూనే ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో, కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ సర్కార్ మంచి ర్యాపో మెయింటెన్ చేస్తూనే ఉంది. ఆ కారణంగా రుణ పరిమితి విషయంలో, రాష్ట్రానికి రుణాల మంజూరు విషయంలో కేంద్రం సహకరిస్తూనే ఉంది. అంతే కాకుండా మరి కొన్ని విషయాల్లోనూ కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మంచిగానే ఉన్నాయి. కానీ జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం తోసి పుచ్చుతోంది. విభజన చట్టం హామీలు. ప్రత్యేక హోదా తదితర కీలక విషయాల్లో మడత పేచీ పెడుతోంది కేంద్రం.

Gajendra Singh Shekhawat

 

పోలవరం నిర్వాసితుల పరిహారం చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని లోక్ సభ సాక్షిగా స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీ  వంగా వీగ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పోలవరం భూసేకరణ పరిహారాన్ని నిర్వసితుల ఖాతాలో వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా ఆ ప్రతిపాదనను కేంద్రం ఆమోదం తెలపలేదని ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నందున నిర్వసిత కుటుంబాలకు కేంద్రమే నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్ర జలశక్తి మంత్విత్వ శాఖ తేల్చి చెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి అనుగుణంగా లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపి ప్రభుత్వం చేసిన ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని కేంద్ర మంత్రి షెకావత్ పేర్కొన్నారు.

Polawaram Project

 

భూసేకరణ, పునరావాసం పై రాష్ట్రం చేసిన ఖర్చుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగడం లేదనిషెకావత్   అన్నారు. భూసేకరణ కింద 2014 ఏప్రిల్ నుండి 2022 డిసెంబర్ వరకూ రూ.3,779.05 కోట్ల బిల్లులు రీయింబర్స్ మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తే అందులో రూ.3,431.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ చేసిందని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.2,267 కోట్ల బిల్లులను పంపితే అందులో రూ.2,110 కోట్ల బిల్లులను చెల్లించామన్నారు. సీఐఏ, సీడబ్ల్యు సిఫార్సుల ఆధారంగా ఎప్పటికప్పుడు బిల్లులను వెరిఫై చేసి చెల్లిస్తున్నామని గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు.

చిన్న పామునైనా పెద్ద కర్తతో కొట్టాలన్న సామెత మాదిరిగా.. నెల్లురు రూరల్ లో కోటంరెడ్డికి ఆ బిగ్ షాట్ తో చెక్ పెట్టిన వైసీపీ

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N