New Parliament Building Inauguration: దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. తొలుత పార్లమెంట్ భవనంలో లోక్ సభ స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్ (రాజదండం)ను ప్రతిష్టించారు. మఠాధిపతుల ఆశీర్వచనంతో సెంగోల్ ప్రతిష్ఠాపన చేశారు. అనంతరం నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు మోడీ సన్మానించారు. కార్మికులను శాలువాలతో సత్కరించి మోడీ జ్ఞాపికలను అందజేశారు.
నూతన పార్లమెంట్ భవనంల సర్వమత ప్రార్ధనలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని పలు విపక్ష పార్టీల బహిష్కరించగా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, లోక్ సభ స్పీకర్, ప్రజా ప్రతినిధులు, బీజేపీ నేతలు పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వేదికపైకి చేరుకుంటారు. ఆ తర్వాత జతీయ గీతా లాపన, రాజ్యసభ డిప్యూటి చైర్మన్ స్వాగత ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12.29 గంటలకు ఉప రాష్ట్రపతి సందేశం, తదుపరి ప్రతిపశ్ర నేతల ప్రసంగాలు, 12.43 గంటలకు లోక్ సభ స్పీకర్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోడీ 75 రూపాయల నాణెం స్టాంపును విడుదల చేస్తారు. అనంతరం 1.10 గంటలకు పీఎం మోడీ ప్రసంగిస్తారు.
2020 డిసెంబర్ 10న పార్లమెంట్ నూతన భవనానికి ప్రధాని మోడీ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని 64,500 చదరపు కిలో మీటర్ల పరిధిలో, నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో ఒకే సారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. లోక్ సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు ఉన్నాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి.
నీతి ఆయోగ్ సమావేశంలో ఏపి ప్రగతి – సంక్షేమ పథకాలు వివరించిన సీఎం జగన్