Peddapuram (Kakinada): కాకినాడ జిల్లా పెద్దపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవేళ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దాపురం ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద ఎదురెదురుగా వస్తున్న టిప్పర్, లారీలు ఢీకొన్నాయి. ఇథనాల్ లోడ్ ట్యాంకర్ లారీ, టిప్పర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో టిప్పర్, ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపుచేశాయి. ప్రమాద సమయంలో ట్యాంకర్ లో 30వేల లీటర్ల ఇథనాల్ ఉంది. ప్రమాదంపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నీతి ఆయోగ్ సమావేశంలో ఏపి ప్రగతి – సంక్షేమ పథకాలు వివరించిన సీఎం జగన్