Project k: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” ఇటీవల విడుదల అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలయ్యి ఆడియన్స్ నీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. అయినా గాని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. “ఆదిపురుష్” దర్శకుడు ఓమ్ రౌత్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాడు కావటంతో సినిమా విజయం సాధిస్తుందని అభిమానులు అనుకున్నారు.
కానీ ఫలితం.. అనుకున్న రేంజ్ లో రాలేకపోయింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు సలార్, ప్రాజెక్ట్ కె… పై పెట్టుకోవడం జరిగింది. ఈ రెండిటిలో సెప్టెంబర్ నెలలో సలార్ విడుదల కాబోతోంది. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెట్టుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ “ప్రాజెక్ట్ కె”…పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రాజెక్ట్ కె…సెట్ కి మూడుసార్లు వెళ్లడం జరిగింది. మేకింగ్ చూసి చాలా ఆశ్చర్యమేసిందని స్పష్టం చేయడం జరిగింది. దీన్ని సరిగ్గా చేస్తే గ్లోబల్ సినిమా అవుతుందని, వరల్డ్ టాప్ 50 చిత్రాల్లో ఉంటుందని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు.
అంతేకాదు ఈ సినిమాకి మొదటి రోజు 500 నుంచి 600 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇది మిస్ అయితే రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ ఆడుతూ పాడుతూ ₹1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని స్పష్టం చేయడం జరిగింది. సరిగ్గా ఇదే తరహాలో కొన్ని రోజుల క్రితం హీరో రానా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ నటించిన “ప్రాజెక్టు కె” తెలుగు సినిమా రంగాన్ని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తమ్మారెడ్డి అదే తరహాలో కామెంట్లు చేయటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.