ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరీశ్వరిపై మంత్రి గుడివాడ అమర్నాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పురందరీశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. అధికారం తలకెక్కితే కన్నూమిన్నూ కానరావని నిజమేనని మంత్రి విమర్శలు చూస్తే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే .. కుటుంబ, వ్యక్తి గత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేయడం దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమని అన్నారు.
‘అసలు మీ తండ్రిగారిది ఏ పార్టీ..? ఆయన చనిపోయిన తర్వాత యువకుడుగా రాజకీయాల్లోకి వచ్చిన మీరు మీ తండ్రి గారి గోప్పమనిషి, ఆయన విలువలు కాపాడు. వ్యక్తిగతంగా విమర్శంచాలనుకుంటే.. మేము కూడా లెక్కలేనన్ని విమర్శలు చేయగలం. కానీ బీజేపీకి సంస్కారం ఉంది’ అని అన్నారు విష్ణువర్థన్ రెడ్డి. రోత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లు అయిన మీరు కూడా మాట్లాడేవారేనా ? అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు చేసినప్పుడు వాటికి రాజకీయంగానే సమాధానం చెప్పుకోవడం నేర్చుకోవాలని హితవు పలికారు. అడ్డగోలు అవినీతి, అప్పుల్లోనూ అక్రమాలు, చేతకాని పరిపాలన చేసిన ప్రభుత్వం ఏపీ అని విమర్శించారు. చేతనైతే పురందేశ్వరి దేవి అడిగిన ప్రశ్నలకు అంశాల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం ప్రజల ముందు విడుదల చేయాలనీ లేదా మీ దగ్గర లెక్కలు వాటి సమాధానాలు ఉంటే భహిరంగ చర్చకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు.
YS Viveka Case: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అజేయ కల్లం..సీబీఐపై ఆరోపణలు