SreeLeela: ఇటీవల “బేబీ” సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సమయంలో అభినందన సభలో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. “బేబీ” సినిమా తాను చూసిన తర్వాత ప్రత్యేకంగా సినిమా యూనిట్ ని అభినందిస్తూ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “అలా వైకుంఠపురంలో” తన చెల్లెలుగా నటించిన సమయంలో రాపో తక్కువైనా గాని ఈ సినిమాలో.. అదిరిపోయే నటన చేయడం జరిగిందని కేవలం తన కోసమే.. ప్రత్యేకంగా మాట్లాడటానికి వచ్చినట్లు బన్నీ చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో సినిమా రంగానికి తెలుగు అమ్మాయిలు రావడం అత్యవసరమని స్పష్టం చేశారు.
ఇటీవల తాను ఒక సినిమా అవార్డుల కార్యక్రమానికి వెళ్లిన సమయంలో తెలుగు వాళ్ళు తప్ప మిగతా ఇండస్ట్రీకి చెందిన వివిధ భాషల అమ్మాయిలు వచ్చారు. ఎవరికి వారు అవార్డులు అందుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఆ టైంలో ఏ తెలుగు అమ్మాయి కూడా నాకు కనబడలేదు చాలా ఫీల్ అయ్యాను. కానీ ప్రజెంట్ మాత్రం తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలి సపోర్ట్ చేయడానికి ఇక్కడ అంతా బాగానే ఉంది. అవసరమైతే తల్లిదండ్రులను తీసుకొని రావచ్చు అని.. నచ్చచెప్పుకుని ఇండస్ట్రీలో రాణించాలని బన్నీ పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం కూర హీరోయిన్ శ్రీలీల అద్భుతంగా రాణిస్తుంది. ఆమె పెద్ద హీరోలతో కూడా ఇప్పుడు అవకాశాలు అందుకుంటూ ఉంది. ఇక వైష్ణవి చైతన్య జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది నువ్వు కూడా కచ్చితంగా టాప్ మోస్ట్ లెవెల్ లోకి వెళ్ళాలి అని బన్నీ వ్యాఖ్యానించడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు హీరోయిన్ శ్రీలీల ఐకాన్ స్టార్ బన్నీ ప్రెస్టేజ్ ప్రాజెక్టు పుష్ప సెకండ్ పార్ట్ లో నటించడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే శ్రీ లీల “పుష్ప”లో స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. పుష్ప మొదటి భాగంలో ఉ అంటావా అనే సాంగ్ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పాటలో సమంత వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే రీతిలో పుష్ప సెకండ్ పార్ట్ లో స్పెషల్ సాంగ్ దేవి శ్రీ ప్రసాద్ డిజైన్ చేసినట్లు ఓర మాస్ బాణీలు అందించినట్లు సమాచారం. ఈ పాటలో శ్రీలీలని.. బన్నీ కావాలని రికమండేషన్ చేసి పెట్టుకున్నట్లు టాక్. ఈ రకంగా శ్రీ లీల.. పుష్ప సెకండ్ పార్ట్ లో కనిపించబోతున్నారు అని ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!