Breaking: మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం కాగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముంబాయి శాంతా క్రూజ్ లోని గెలాక్సీ హోటల్ నందు అగ్ని ప్రభావం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
విషయం తెలిసిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసారు. హోటల్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సజీవ దహనం అయిన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.