ఏపీలో ఎస్ఐ పోస్టులకు ఫైనల్ రాత పరీక్షలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. అక్టోబర్ 14,15 తేదీల్లో ఎస్ఐ ఫైనల్ రాత పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో సివిల్, ఎపీఎస్పీ ఎస్ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలు లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీ పోలీస్ నియామక మండలి చైర్మన్ అతుల్ సింగ్ వెల్లడించారు. పీఎంటీ, పీఈటీ ఫలితాలు వెల్లడించిన తర్వాత తుది రాత పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
ఎస్ఐ తుది రాత పరీక్షల్లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు డిస్క్రిస్టివ్ విధానంలో, మరో రెండు పేపర్లు అబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. అక్టోబర్ 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. అలాగే అక్టోబర్ 15న ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్ 3, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ – 4 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు అబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
రాష్ట్రంలో మొత్తం 411 ఎస్ఐ పోస్టులకు గానూ ప్రిలిమనరీ పరీక్షలను ఈ ఏడాది ఫిబ్రవరి 19న పరీక్షలు నిర్వహించగా, 57,923 మంది అభ్యర్ధులు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. వీరిలో 56,130 మంది అభ్యర్ధులు స్టేజ్ – 2 ఆన్ లైన్ అప్లికేషన్ సమర్పించడంతో ఈ నెల 25వ తేదీ నుండి విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు నాలుగు కేంద్రాల్లో దేహధారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి.
YSRCP: పవన్ కు షాక్ ఇస్తూ వైసీపీలో చేరిన జనసేన నేత