Tirumala: తిరుమల అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామనీ, భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదనీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఏడవ మైలు శ్రీ నరసింహ స్వామి ఆలయం సమీపంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందన్నారు. రెండు నెలల్లో చిక్కిన ఐదవ చిరుత ఇది అని ఆయన తెలిపారు. భక్తుల క్షేమం, భద్రత విషయంలో, వారి సౌలభ్యం కోసం టీటీడీ ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు.
అటవీశాఖ అధికారుల సహకారంతో, దాదాపు 300 మంది అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో నిరంతర కృషి జరుగుతోందని చెప్పారు. ఈ కారణంగానే ఐదవ చిరుతను ఈ రోజున పట్టుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు చిరుత పులి దాడికి గురైతే, అందులో ఒక పాప మరణించినట్లు తెలిపారు.
ఆ తర్వాత మరింత అప్రమత్తతో నడక దారిలో నడుస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించమని, వారితో పాటు తోడుగా భద్రత సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు చేసామన్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే చిన్న పిల్లలు నడిచేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ చిరుత నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన చెప్పారు.
Lagadapati Rajagopal: బిగ్ న్యూస్ : లగడపాటి రాజ్ గోపాల్ రీ ఎంట్రీ – ఆ నియోజికవర్గం లో పోటీ ?