Samantha: హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇవ్వటం తెలిసిందే. లాస్ట్ సినిమా విజయ్ దేవరకొండ తో నటించిన “ఖుషి” విజయం సాధించాక.. సమంత విదేశాలకు వెళ్లిపోవడం జరిగింది. శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సమంతకి మంచి బ్రేక్ ఇవ్వటం జరిగింది. ప్రేమ కథ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో “ఖుషి” విజయం సాధించింది. అయితే గత ఏడాది సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటం తెలిసిందే.
ప్రాణాంతకరమైన ఈ వ్యాధి బారిన పడిన సమంత.. కొన్ని నెలల పాటు మంచానికి పరిమితమైంది. ఆ సమయంలో ఎలాంటి షూటింగులు చేయలేదు. చాలా బలమైన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. దీంతో సమంత గతంలో ఉన్న అందం చాలా వరకు కోల్పోయింది. అయితే మార్చి నెలకి మొత్తం రికవరీ అయ్యి షూటింగ్లకు రెడీ అయిన సమంత.. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ మొత్తం కంప్లీట్ చేసింది. ఇక అనంతరం చివరిగా “ఖుషి” సినిమా మొత్తం కంప్లీట్ చేసి సినిమా విజయం తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాక విదేశాలకు వెళ్లిపోవడం జరిగింది. అయితే సమంత సినిమాలకు ఫుల్ బ్రేక్ ఇవ్వటం జరిగింది. “ఖుషి” తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదు.
అయినా గాని సమంత కోట్లు కోట్లు సంపాదిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మేటర్ లోకి వెళ్తే.. పెయిడ్ ప్రమోషన్స్.. ఇతర ఎండోర్స్మెంట్ మార్గాల ద్వారా.. రాబడి గట్టిగా వస్తుందట. విదేశాలలో విశ్రాంతి తీసుకుంటున్న గాని సమంత ఈ రకంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే సమంత విదేశాలలో ఉంటూ రిలాక్స్ అవుతూ బ్యాలెన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు టాక్. ఒక ఏడాదిలో మునుపటి ఛాయ అందం పొందేలా పలు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉందంట. ఇక ఇదే సమయంలో కాస్త గ్యాప్ దొరికితే స్టోరీలు వింటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కువగా బాలీవుడ్ పై సమంత దృష్టి పెట్టినట్లు సమాచారం.