Rajamouli Mahesh Babu: ప్రపంచ సినిమా రంగంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని అమాంతం పెంచేసిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. “బాహుబలి 2”, “RRR” సినిమాలు ప్రపంచ స్థాయిలో సత్తా చాటాయి. “RRR” సినిమా రెండు ఆస్కార్ అవార్డులను కూడా తెలుసుకోవడం తెలిసిందే. “RRR” సినిమా చూసి ప్రపంచ టాప్ మోస్ట్ దర్శకులలో ఒకరైన జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళితో కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు మీడియా ముందు తెలియజేశారు. ఇదిలా ఉంటే “RRR” తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. అయితే మహేష్ బాబుతో చేయబోయే చిత్రం షూటింగ్ బాహుబలి తరహాలో స్టార్ట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారట.
విషయంలోకి వెళ్తే బాహుబలి సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు.. ప్రభాస్, రానా హీరోయిన్ అనుష్క సినిమాలో కీలక పాత్రలు చేసే వారికి జక్కన్న యాక్షన్ క్లాసులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే తరహాలో మహేష్ బాబు సినిమా స్టార్ట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేయడం జరిగిందంట. ఈ క్రమంలో వచ్చే ఏడాది ప్రారంభంలో మహేష్ ప్రాజెక్టుకు సంబంధించి యాక్షన్ క్లాస్ లు రాజమౌళి స్టార్ట్ చేయబోతున్నారంట. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఎక్కడ కూడా టైం వేస్ట్ కాకుండా ముందుగానే సీన్స్ పై అవగాహన ఉండేవిధంగా రాజమౌళి ఈ యాక్షన్ క్లాసులను తీసుకుంటున్నారట. అంతేకాదు 2025 చివరికి సినిమా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మహేష్ బాబు “గుంటూరు కారం” పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 20 కల్లా కంప్లీట్ చేయనున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి నెలలో గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది. దీంతో విడుదలకు రెండు వారాలు ముందు.. మహేష్ బాబు .. ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారట. ఆ తర్వాత “గుంటూరు కారం” విడుదలయ్యాక సంక్రాంతి పండుగ అనంతరం రాజమౌళి ప్రాజెక్టుకి సంబంధించి యాక్షన్ క్లాసులలో మహేష్ జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ స్థాయిలో భారీ బడ్జెట్ తో మహేష్ బాబు సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.