CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో జగనన్న తోడు పథకం ద్వారా 79.174 శాతం వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ది జరిగిందనీ, సామాజిక సాధికారతకు ఇది నిదర్శనమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దేశంలోనే జగనన్న తోడు పథకం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను సీఎం జగన్ ఇవేళ బటన్ నొక్కి విడుదల చేశారు. ఒక్కొక్కరికి రూ.10వేల వంతున వడ్డీ లేని రుణం అందించారు సీఎం జగన్. దీని వల్ల 3,95,000 చిరు వ్యాపారులకు లబ్ది చేకూరింది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే కార్యక్రమం అని కొనియాడారు. చిరు వ్యాపారులను ఆదుకోవడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తొందన్నారు. దేశ వ్యాప్తంగా పీఎం స్వనిధి ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే, ఏపీలో ఏకంగా 16,73,576 మందికి జగనన్న తోడు ద్వారా వడ్డీ లేని రుణాలు అందించడం జరిగిందన్నారు.
నాలుగున్నరేళ్లలో చిరువ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. ఈ పథకం ద్వారా లబ్దిపొందే వారిలో దాదాపు 87 శాతం మహిళలే ఉన్నారని ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. జగనన్న తోడు పథకం ద్వారా అందించేది చిన్న మొత్తమే అయినా వారి జీవితాలకు ఇది గోరంత దీపమని పేర్కొన్నారు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద వారు నిలదొక్కుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తొందన్నారు.
Mudragada Padmanabham: ముద్రగడ మదిలో ఏముంది ..?