NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: బాలినేని వ్యవహారం మళ్లీ మొదటికి .. అలకపాన్పు ఎక్కినట్లే(నా)..! 

YSRCP: వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యవహారం మళ్లీ మొదటి వచ్చినట్లు తెలుస్తొంది. బాలినేని తరచు అలకపాన్పు ఎక్కడం, పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించడం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా పార్టీ పెద్దలతో చర్చల అనంతరం ఒంగోలుకు చేరుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంపీ ఎవరైతే నాకేంటి..నా పని నేను చేసుకుపోతాను..అని వ్యాఖ్యానించారు. తనకు ఒంగోలులో పేదల ఇళ్ల పట్టాల పంపిణీయే ముఖ్యమని చెప్పుకొచ్చారు.

Balineni Srinivasa Reddy

అయితే మళ్లీ వైసీపీ హైకమాండ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైదరాబాద్ కు వెళ్లిపోయారని అంటున్నారు. ఒంగోలు పార్లమెంట్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఒంగోలు పార్లమెంట్ టికెట్ విషయంలో బాలినేని పట్టుబట్టిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికే టికెట్ ఖరారు చేయాలని పార్టీ పెద్దల వద్ద డిమాండ్ పెట్టారు.

అయితే పార్టీ హైకమాండ్ మాత్రం మాగుంటకు  టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. రెండు రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డిలతో బాలినేని చర్చలు జరిపారు. ఒంగోలు లోక్ సభ స్థానం నుండి సీఎం జగన్ ఆదేశాల మేరకు చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోటీ చేస్తారని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలుస్తొంది. పార్టీ బాధ్యతలు మాత్రం చెవిరెడ్డికి అప్పగించడం లేదని బాలినేనికి చెప్పారుట. దీంతో ఒంగోలుకు చేరుకున్న బాలినేని .. ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.

మాగుంట టికెట కోసం అడగితే పార్టీ మారుతాననితన పై దుష్ప్రచారంచ చేస్తున్నారని వాపోయారు. అయితే ఆ రాత్రికే ఒంగోలు పార్లమెంట్ పార్లమెంట్ పార్టీ ఇన్ చార్జి బాధ్యతలను చెవిరెడ్డికి అప్పగిస్తూ వైసీపీ ప్రకటన విడుదల చేసింది. దీంతో పార్టీ హైకమాండ్ తనకు చెప్పింది ఒకటి, చేసిందోకటి అంటూ బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ కు వెళ్లిపోయారుట. తన మాటకు విలువ లేని చోట తాను ఉండటం ఎందుకు అని సన్నిహితుల వద్ద బాలినేని వాపోయారని అంటున్నారు.

తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని కూడా ముఖ్య నేతలకు బాలినేని చెప్పినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. బాలినేని మెత్తపడ్డారు. ఒంగోలు వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మరల బాలినేని అలకపాన్పు ఎక్కడం మరో సారి హాట్ టాపిక్ అయ్యింది. ఈ సారి పార్టీ హైకమాండ్ పెద్దలు బాలినేనిని బుజ్జగిస్తారా లేక ఒంగోలుకు ప్రత్యామ్నాయ అభ్యర్ధిని రంగంలోకి దింపుతారా అనేది వేచి చూడాలి.

YS Sharmila: ఢిల్లీ కేంద్రంగా జగనన్న పరువు తీయడానికి సిద్దమైన చెల్లి షర్మిలమ్మ

Related posts

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju