YSRCP: వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యవహారం మళ్లీ మొదటి వచ్చినట్లు తెలుస్తొంది. బాలినేని తరచు అలకపాన్పు ఎక్కడం, పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించడం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా పార్టీ పెద్దలతో చర్చల అనంతరం ఒంగోలుకు చేరుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంపీ ఎవరైతే నాకేంటి..నా పని నేను చేసుకుపోతాను..అని వ్యాఖ్యానించారు. తనకు ఒంగోలులో పేదల ఇళ్ల పట్టాల పంపిణీయే ముఖ్యమని చెప్పుకొచ్చారు.
అయితే మళ్లీ వైసీపీ హైకమాండ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైదరాబాద్ కు వెళ్లిపోయారని అంటున్నారు. ఒంగోలు పార్లమెంట్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఒంగోలు పార్లమెంట్ టికెట్ విషయంలో బాలినేని పట్టుబట్టిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికే టికెట్ ఖరారు చేయాలని పార్టీ పెద్దల వద్ద డిమాండ్ పెట్టారు.
అయితే పార్టీ హైకమాండ్ మాత్రం మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. రెండు రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డిలతో బాలినేని చర్చలు జరిపారు. ఒంగోలు లోక్ సభ స్థానం నుండి సీఎం జగన్ ఆదేశాల మేరకు చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోటీ చేస్తారని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలుస్తొంది. పార్టీ బాధ్యతలు మాత్రం చెవిరెడ్డికి అప్పగించడం లేదని బాలినేనికి చెప్పారుట. దీంతో ఒంగోలుకు చేరుకున్న బాలినేని .. ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.
మాగుంట టికెట కోసం అడగితే పార్టీ మారుతాననితన పై దుష్ప్రచారంచ చేస్తున్నారని వాపోయారు. అయితే ఆ రాత్రికే ఒంగోలు పార్లమెంట్ పార్లమెంట్ పార్టీ ఇన్ చార్జి బాధ్యతలను చెవిరెడ్డికి అప్పగిస్తూ వైసీపీ ప్రకటన విడుదల చేసింది. దీంతో పార్టీ హైకమాండ్ తనకు చెప్పింది ఒకటి, చేసిందోకటి అంటూ బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ కు వెళ్లిపోయారుట. తన మాటకు విలువ లేని చోట తాను ఉండటం ఎందుకు అని సన్నిహితుల వద్ద బాలినేని వాపోయారని అంటున్నారు.
తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని కూడా ముఖ్య నేతలకు బాలినేని చెప్పినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. బాలినేని మెత్తపడ్డారు. ఒంగోలు వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మరల బాలినేని అలకపాన్పు ఎక్కడం మరో సారి హాట్ టాపిక్ అయ్యింది. ఈ సారి పార్టీ హైకమాండ్ పెద్దలు బాలినేనిని బుజ్జగిస్తారా లేక ఒంగోలుకు ప్రత్యామ్నాయ అభ్యర్ధిని రంగంలోకి దింపుతారా అనేది వేచి చూడాలి.
YS Sharmila: ఢిల్లీ కేంద్రంగా జగనన్న పరువు తీయడానికి సిద్దమైన చెల్లి షర్మిలమ్మ