NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ఢిల్లీ కేంద్రంగా జగనన్న పరువు తీయడానికి సిద్దమైన చెల్లి షర్మిలమ్మ

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితి లేదు. ఈ రెండు పార్టీలు కేంద్రంలోని బీజేపీకి అనధికార మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రీసెంట్ గా ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల .. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై గళం విప్పుతున్నారు.

గత కొద్ది రోజులుగా జిల్లాల పర్యటనలు నిర్వహించి అధికార ప్రతిపక్ష పార్టీలను విమర్శించిన వైఎస్ షర్మిల తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి చేయడానికి పూనుకున్నారు. ఈ క్రమంలో విపక్ష నేతలను కలిసి మద్దతు కోరారు. ఈవేళ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి వైఎస్ షర్మిల దీక్ష చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై అధికార వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదు. కేంద్రాన్ని ఎందుకు నిలదీయం లేదు. మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు చెప్పాలి అంటూ జగనన్న సర్కార్ ను ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారని, తిరుపతిలో జరిగిన సభలోనూ ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చారన్నారు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.

సీమాంధ్ర ను స్వర్ణాంధ్ర చేస్తామని ప్రధాని చెప్పారనీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చారని, ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ఏపీ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున తాను అడుగుతున్నానని ప్రశ్నించారు. ఇవేళ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిలిగిపోయిందని అన్నారు. కేవలం ఓటు బ్యాంక్ కోసం ఏవోవో మాయమాటలు చెప్పి వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరో సారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఏపీలో బీజేపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా ఆ పార్టీయే రాష్ట్రంలో రాజ్యమేలుతోందని విమర్శించారు. సీఎం జగన్ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పితే ద్రోహం చేసిన వారు అవుతారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసునని అన్నారు. ఈ విషయంలో కఛ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీకి, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తొలుత ఏపీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ధర్నా కోసం ఏపీ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తుండగా, ఏపీ భవన్ భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదని వెల్లడించారు. అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్వివాదానికి దిగారు. ఆ తర్వాత దీక్షను కొనసాగించారు. వైఎస్ షర్మిల ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి జాతీయ మీడియా హైలెట్ చేసింది.

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju