Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వంశీకి విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. 2019 ఎన్నికల సందర్భంలో ప్రసాదంపాడులో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వంశీ గతంలో జరిగిన విచారణకు గైర్హజరు అయ్యారు.
దీంతో గత విచారణలోనే బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. అయితే ఇవేళ విచారణకు కూడా వంశీ కోర్టుకు హజరు కాలేదు. దీంతో వంశీపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ను అమలు చేయాలని పోలీసులకు ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
కాగా..2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో 38 మంది పై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం విచారణ జరుపుతోంది.