Poonam Pandey: బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈమె క్యాన్సర్ కారణంగా నేడు మృతి చెందింది. బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించిన పూనమ్ పాండే బాగా పాపులర్ అయింది. అంతేకాకుండా కాంట్రవర్సీలో కూడా చిక్కుకుంది.
ఇక తాజాగా ఈమె క్యాన్సర్ కారణంగా కన్నుమూసినట్లు తెలుస్తుంది. ఇక పూనం పాండే మరణ వార్త విన్న బాలీవుడ్ ప్రజలు ఉలిక్కిపడ్డారని చెప్పొచ్చు. నిన్న మొన్నటి వరకు ఎంతో యాక్టివ్ గా ఉన్న ఈమె సడన్గా చనిపోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈమె గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లు ఈమె కుటుంబం ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక పూనమ్ పాండే సినిమాల్లో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయిందని చెప్పొచ్చు.
బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు గాంచిన పూనమ్ చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియా మధ్యమాలలో మాత్రమే యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఆస్తుల గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె వెనకేసిన ఆస్తులు భారీగానే ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఇక ఈమెకి ఓ ఖరీదైన కారు ఉందట. దాని విలువ అక్షరాల రూ. 60 లక్షలు ఉంటుందట.
ఇక ఈమె నివసించే ఫ్లాట్ ధర అక్షరాల కోటి రూపాయల వరకు ఉంటుందట. అలానే ఈమెకి లాండ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అతి తక్కువ బడ్జెట్లో చూసుకున్నప్పటికీ ఈమె ఆస్తుల విలువ మొత్తం ఒక పది నుంచి 15 కోట్ల వరకు ఉండనున్నట్లు సమాచారం. ఈమె సంపాదించిన ప్రతి రూపాయిని కూడా పొదుపు చేసుకుందట. ఇక ఈమెకి ఇలా జరగడం బాధాకరం. ప్రస్తుతం పూనమ్ ఆస్తుల విలువ సోషల్ మీడియాలో నెట్టీంట చర్చగా మారాయి.