NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఈ రాజు గారికి టికెట్ ఇవ్వొద్దు .. ఆచంట వైసీపీ అసమ్మతి నేతల డిమాండ్

YSRCP:  ఏపీలో సార్వత్రిక ఎన్నికల దగ్గరపడుతున్న తరుణంలో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్న నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మండల స్థాయి నాయకులు జట్టు కడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిని మార్చాలని డిమాండ్ చేయడం, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఇవేళ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు వ్యతిరేకంగా నేతలు సమావేశమైయ్యారు. నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ మండలం సిద్ధాంతంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల వైసీపీ నేతలు విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు .. ఎమ్మెల్యే రంగనాథరాజుకు వ్యతిరేకంగా గళం విప్పారు.

నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కనీస గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గ నాయకుడితో కూడా ఆయన గౌరవం గా మాట్లాడటం లేదని మండిపడ్డారు. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కు రంగనాథరాజు  చెడ్డపేరు తీసుకువస్తున్నారని అన్నారు. కేవలం జగన్ వల్లనే తాము రంగనాథరాజుకు ఓట్లు వేసి గెలిపించామన్నారు.

నియోజకవర్గంలో చాలా మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారని వారు మండిపడ్డారు. ఒక వేళ రంగనాథరాజుకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాము పార్టీ అధిష్టానానికి తమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో పరిస్థితులపై ఇప్పటికే పార్టీ హైకమాండ్ దృష్టి సారించినట్లు సమాచారం. సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళం విప్పడంతో పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్ధి ఓట్ల చీలికతో నాటి కాంగ్రెస్ అభ్యర్ధి పితాని సత్యనారాయణ విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో ఎన్నికల్లో టీడీపీ తరపున పితాని సత్యనారాయణ వైసీపీ అభ్యర్ధిపై కేవలం 3,920 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో చెరుకువాడ శ్రీరంగనాథరాజు టీడీపీ అభ్యర్ధి పితానిపై 12,886 ఓట్ల తేడాతో గెలుపొందారు. జనసేన పార్టీ అభ్యర్ధికి 13,993 ఓట్లు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి అభ్యర్ధి బరిలో దిగుతున్న ఈ తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు జట్టుకట్టడం ఇబ్బందికరంగా మారింది. పార్టీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Nara Lokesh: ప్రతి ఏటా డీఎస్సీ .. నిరుద్యోగులకు నారా లోకేష్ హామీ

Related posts

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N