Pushpa 3: 2021లో విడుదలైన “పుష్ప” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ కాబోతోంది. మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధికమైన భాషల్లో విడుదల చేయబోతున్నారు. “పుష్ప” సినిమాకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా బన్నీ గెలుచుకున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో “పుష్ప” ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. చిన్నవాళ్లు మొదలుకొని పెద్దవాళ్ల వరకు ఈ దేశం ఆ దేశం అని కాకుండా సినిమా ప్రేక్షకులు అందరిని “పుష్ప” ఉర్రూతలు ఊగించింది. ఈ సినిమాలో తగ్గేదేలే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
“పుష్ప” సినిమాకి సంబంధించి పాటలు మరియు డైలాగులు చాలామంది సోషల్ మీడియాలో మిమ్స్ చేయటం జరిగింది. ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బన్నీ కెరియర్ పుష్ప మార్చేసింది. ఈ సినిమాతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ చాలా జాగ్రత్తగా తీస్తున్నారు. స్క్రిప్ట్ విషయంలో ఇంకా హీరో పాత్రకి సంబంధించి మేనరిజం విషయంలో చాలా హోం వర్క్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల “పుష్ప” మూడో భాగం కూడా ఉన్నట్లు వార్తలు రావడం జరిగాయి. లేటెస్ట్ గా అల్లు అర్జున్ సైతం ఈ రకంగానే కామెంట్లు చేశారు.
విషయంలోకి వెళ్తే జర్మనీలో బెర్లిన్ అంతర్జాతీయ సినిమా వేడుకలలో బన్నీ ప్రత్యేక అత్యధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ సినీ ప్రాముఖ్యత గురించి మాట్లాడటం జరిగింది. అనంతరం ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పుష్ప సెకండ్ పార్ట్ మొదటి భాగం కంటే చాలా బాగుంటుందని వ్యాఖ్యానించారు. సినిమాలో అదిరిపోయే సన్నివేశాలు ఉంటాయని తెలిపారు. ఇదే సమయంలో “పుష్ప” మూడో భాగం కూడా ఆశించవచ్చు. దీనిని ఫ్రాంచేజీగా మార్చాలనుకుంటున్నాం అని అల్లు అర్జున్ స్పష్టం చేయడం జరిగింది.