Ram Charan Allu Arjun: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం వైజాగ్ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినా అనంతరం మిగిలిన ఏపీకి కాస్తో కూస్తో.. చెప్పుకో తగ్గ సిటీగా విశాఖపట్నం ఉనికిలో ఉంది. ఈ క్రమంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పట్టణంపై గట్టిగా ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా అక్కడ నుండి పరిపాలన చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఆల్రెడీ పలు అంతర్జాతీయ సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. రెండోసారి ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నం నుండి పరిపాలన అందిస్తానని ఇటీవల సంచలన ప్రకటన చేశారు.
ఇక ఇదే సమయంలో సినిమా పరంగా కూడా విశాఖపట్నంలో వరుస పెట్టి షూటింగ్ లు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా మెగా కాంపౌండ్ కి చెందిన స్టార్ హీరోలు అల్లు అర్జున్ ఆల్రెడీ ల్యాండ్ అవ్వగా మరియు రామ్ చరణ్ కూడా త్వరలో రాబోతున్నాడట. బన్నీ ఆదివారం నాడే విశాఖ చేరుకుని “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. పుష్ప మొదటి భాగం 2021 డిసెంబర్ మాసంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దీంతో సెకండ్ పార్ట్ షూటింగ్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాగా విశాఖపట్నం చేరుకున్న అల్లు అర్జున్ కి విమానాశ్రయం నుండి అభిమానులు ఘన స్వాగతం పలికారు. బన్నీ దాదాపు వారం రోజుల పాటు విశాఖలో సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నా యి.
వైజాగ్ షెడ్యూల్ లో ఫహద్ ఫాజిల్ కూడా జాయిన్ అవుతున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా ఈ వారంలోనే విశాఖలో ల్యాండ్ కాబోతున్నాడట. శంకర్ దర్శకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న “గేమ్ చేంజర్” సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. దాదాపు నెలరోజుల పాటు షెడ్యూల్ లో చరణ్ తో పాటు సినిమాలో కీలకమైన నటీనటులు పాల్గొననున్నారు. ఆల్రెడీ “గేమ్ చేంజర్” షూటింగ్ ప్రారంభంలో వైజాగ్ నందు ఓ షెడ్యూల్ నిర్వహించడం జరిగింది. మరోసారి ఇప్పుడు అదే సినిమా టీం వైజాగ్ లో.. మరో షెడ్యూల్ నిర్వహించబోతున్నట్లు టాక్. ఈ ఇద్దరు మాత్రమే కాదు చిరంజీవి “విశ్వంభర” షూటింగ్ షెడ్యూల్ కూడా వైజాగ్ నందు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.