CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తన సొంత నియోజకవర్గం పులివెందులలో రూ.861.84 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు.
రూ.500 కోట్ల నాబార్డు, ఆర్ఐడీఎఫ్ నిధులతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల, గవర్నమెంట్ జెనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) భవనాలను, పులివెందుల మైన్స్ సమీపంలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ వద్ద రూ.20.15 కోట్ల వ్యయంతో నిర్మించిన బనానా ప్యాక్ హౌస్ (పులివెందుల మార్కెట్ కమిటీ) భవనాన్ని, రూ.38.15 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియేట్ కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభించారు.
అలానే రూ.70 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ జంక్షన్ ను, పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా రూ.11.04 కోట్ల వ్యయంతో అభివృధ్ధి చేసిన సెంట్రల్ బౌలే వార్డుకు, రూ.20.69 కోట్లతో అధునాతన వసతులతో నిర్మించిన వైఎస్ జయమ్మ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవన సముదాయాన్ని, రూ.80 లక్షల తో నిర్మించిన గాంధీ జంక్షన్ ను, రూ.65.95 కోట్ల తో వంద ఎకరాల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ ను ప్రారంభించడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ప్రయివేట్ పార్ట్నర్ ఆధ్వర్యంలో రూ.175 కోట్ల తో 16.63 ఎకరాల్లో నిర్మించిన ఆదిత్య బిర్లా యూనిట్ ను, ఇడుపులపాయ ఎస్టేట్ లో రూ.39.13 కోట్ల నిధులతో 16 ఎకరాల్లో నిర్మించిన వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ .. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శనీయమని అన్నారు. ముఖ్యమంత్రిగా మీ అందరి ముందు నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణమని అన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పులివెందులలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి అనేది అనంతరం అని, కానుగుణంగా అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. సొంత గడ్డపై మమకారం ఎప్పటికీ తీరిపోయేది కాదని అన్నారు.
YS Viveka Case: వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి ఊరట .. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు