YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసులో 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇంతకు ముందు పలు పర్యాయాలు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లను సీబీఐ కోర్టు, హైకోర్టు తిరస్కరించాయి. తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది.
రూ.2లక్షల వూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో హజరుకావాలని స్పష్టం చేసింది. సీబీఐ కోర్టులో ట్రయల్ జరిగే సమయంలో ఏపీలో ఉండకూడదని హైకోర్టు షరతు విధించింది. అంతే కాకుండా ఆయన పాస్ పోర్టును కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు శివశంకర్ రెడ్డికి ఇవేళ బెయిల్ మంజూరు చేయడంతో రేపు (మంగళవారం) చంచల్ గూడ జైలు నుండి విడుదలై పులివెందులకు వెళ్లనున్నారు.
Supreme Court: సుప్రీం కోర్టులో ప్రొఫెసర్ సాయిబాబాకు బిగ్ రిలీఫ్ .. మహారాష్ట్ర సర్కార్ షాక్