Sukumar: 2021లో విడుదలైన “పుష్ప” సినిమా ప్రపంచాన్ని షేక్ చేసి పడేసింది. పాన్ ఇండియా నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. అన్ని చోట్ల విజయం సాధించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనరిజం అందరినీ ఆకట్టుకోవటం జరిగింది. ముఖ్యంగా తగ్గేదేలే డైలాగ్.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ గా నిలిచింది. “పుష్ప” సినిమా అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాతో నటుడిగా అల్లు అర్జున్ మరోసారి తన టాలెంట్ ఏంటో నిరూపించారు. అంతేకాదు ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా గత ఏడాది గెలవడం జరిగింది. ఇదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా జాతీయ అవార్డు అందుకున్నారు.
కాగా ఇప్పుడు గామా అవార్డ్స్ వేడుకలలో బెస్ట్ డైరెక్టర్ గా “పుష్ప” సినిమాకి గాను సుకుమార్ గామా అవార్డ్ గెలవడం జరిగింది. ఇటీవల ఈ అవార్డ్స్ వేడుక హైదరాబాద్ లో జరిగాయి. ఈ క్రమంలో “పుష్ప” సినిమాకి గాను సుకుమార్ కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడంతో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ చేస్తున్నారు. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావటంతో రెండో భాగం చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు “పుష్ప” సెకండ్ పార్ట్ విడుదల చేస్తున్నారు. మొదటి భాగం విడుదలైన భాషల్లో కంటే అత్యధికంగా…”పుష్ప 2″ రిలీజ్ చేయబోతున్నారు.
ఇటీవలే వైజాగ్ లో ఓ షెడ్యూల్ సిద్ధం చేయడం జరిగింది. ఈ క్రమంలో రెండు రోజులు షూటింగ్ జరపగా.. బన్నీ అనారోగ్యానికి గురికావడంతో.. షూటింగ్ మొత్తం హైదరాబాద్ కి షిఫ్ట్ చేయటం జరిగిందట. ఏది ఏమైనా అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు “పుష్ప” సెకండ్ పార్ట్ ప్రమోషన్స్ కి కనీసం నెల రోజులైనా సమయానికి కేటాయించాలని భావిస్తున్నారు. దీంతో జూన్ లేదా జూలై మాసం కల్లా సినిమా మొత్తం కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు.