రాజకీయాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మారిపోతున్నాయి. ఉమ్మడి కూటమి పార్టీల మధ్య ఐక్యత ఉందా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఆశలకు మాత్రం కొంత భంగపాటు తప్పడం లేదు. టికెట్లు ప్రకటించిన తర్వాత.. సహజంగా నియోజకవర్గాల్లో ఊపు రావాలి. పైగా.. మూడు పార్టీల కూటమి(టీడీపీ-జనసేన-బీజేపీ) కార్యకర్తలతో హోరెత్తిపోవాలి. కానీ, అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. దీనికి ఎవరు బాధ్యులు అనేది ప్రశ్న.
సరే.. ఈ విషయం పక్కన పెడితే.. చంద్రబాబు నాయుడు టికెట్లు ఎనౌన్స్ చేసిన తర్వాత.. దెందులూరు నియోజకవర్గంలో దీపావళి పండుగ వచ్చినట్టు అయింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. దెందులూరు నియోజకవర్గాన్ని అనేక తర్జన భర్జనల తర్వాత.. చింతమనేని ప్రభాకర్కే కేటాయించారు. దీంతో ఈ నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేశారు.
కట్ చేస్తే.. పిఠాపురం నియోజకవర్గంలో ఈ తరహా వాతావరణం జనసేనలో ఎక్కడా కనిపించలేదు. ఎం దుకంటే.. ఈ సీటు నుంచి తానే పోటీ చేస్తానని పవన్ చెప్పారు. దీంతో వాస్తవానికి పిఠాపురంలో సంబరా లు అంబరాన్నంటాలి. పైగా పవర్ స్టార్ పవన్ ఇక్కడ నుంచి రంగంలోకి దిగుతానని చెప్పాక.. ఇక, ఆయ న అభిమానుల ఆనందం కట్టలు తెగాలి. ఉవ్వెత్తున సంబరాలు ఎగిసి పడాలి. పవన్.. పవన్ నినాదాలతో నియోజకవర్గం హోరెత్తిపోవాలి.
అయితే.. ఇలాంటివేవీ కనిపించలేదు. పైగా.. మిత్రపక్షం టీడీపీ నుంచి కార్యకర్తలు రోడ్డెక్కారు. తీవ్ర నిర సన వ్యక్తం చేశారు. జెండాలు, బ్యానర్లు తగలబెట్టారు. కట్ చేస్తే.. వివాదం ఇప్పుడు చంద్రబాబు చెంతకు చేరింది. ఏదో ఒక రకంగా పరిష్కారం అయితే చూపుతారు. కానీ, ఈ పరిష్కారం.. క్షేత్రస్థాయిలో కార్యకర్తల ను ముందుకు నడిపిస్తుందా? పవన్కు జేజేలు కొట్టేలా చేస్తుందా? అనేది మౌలిక ప్రశ్న.
ఎలా చూసుకు న్నా.. ముందు నుంచి ప్లాన్ లేకపోవడం.. తర్జన భర్జనలు.. వేచి ఉండడాలు ఇలా అనేక అంశాలు.. ఇలాంటి వివాదాలకు దారితీయడం గమనార్హం. దీనికి ఎవరు బాధ్యులు అంటే.. పవనే బాధ్యుడని చెప్పాలి. కేడర్ను ఏర్పాటు చేసుకోకుండా చోద్యం చూడడం ఆయన చేసిన ప్రధమ తప్పిదమని అంటున్నారు పరిశీలకులు.